E-Paper
Advertisement

కూటమిని విడగొట్టేందుకు వైసీపీ స్కెచ్.. విజయ్‌ విక్టరీని చూపిస్తూ పవన్ టార్గెట్, ఇంతకీ అంబటి ఏమన్నారు?

కూటమిని విడగొట్టేందుకు వైసీపీ స్కెచ్.. విజయ్‌ విక్టరీని చూపిస్తూ పవన్ టార్గెట్, ఇంతకీ అంబటి ఏమన్నారు?
Advertisement

Amaravati:  ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ మరోసారి టార్గెట్ చేసిందా? ఎలాగైనా కూటమి నుంచి జనసేనను విడగొట్టేందుకు కొత్త స్కెచ్ వేసిందా? తమిళనాడులో విజయ్ విక్టరీని చూపిస్తూ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిందా? అంబటి రాంబాబు ట్వీట్ వెనుక అసలు  ఉద్దేశం ఏంటి?

కూటమిని విడగొట్టేందుకు వైసీపీ స్కెచ్

Advertisement

‘కూటమిని విడగొడితే గానీ.. వైసీపీ అధికారంలోకి  రావడం కష్టమని తేల్చేశారు వైసీపీ ఎగ్జిట్ నేత విజయ సాయిరెడ్డి’.  గతంలో అంటే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో వీఎస్ఆర్ వేసిన స్కెచ్ వర్కవుటయ్యింది. సాయిరెడ్డి చెప్పిన మాటల ఫార్మూలాని వైసీపీ నేతలు తప్పకుండా పాటిస్తున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం-టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన మెజార్టీ రాకున్నా, అతి పెద్ద పార్టీగా ఘన విజయం సాధించింది. విజయ్ విక్టరీని ఉద్దేశిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఎక్స్ వేదికగా ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

Advertisement

విజయ్‌ విక్టరీని చూపిస్తూ పవన్ టార్గెట్ చేసిన అంబటి

కేవలం ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన‌ట్టు’ అంటూ ఆ పోస్ట్ పెట్టారు అంబటి. రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. ఒంటరిగా గెలవగా, ఏపీలో పవన్ కల్యాణ్ పొత్తుల ద్వారా విజయం సాధించడాన్ని పోల్చినట్టు స్పష్టమవుతోంది. అంతకుముందు అంబటి మరో ట్వీట్‌ చేశారు.

తమిళనాడులో స్టాలిన్-ఉదయనిధి ఓటమి.. భవిష్యత్తులో చంద్రబాబు-లోకేష్ పడుతుందని కంపేర్ చేసే ప్రయత్నం చేశారు. అంతకుమించి ఆయనేమీ రాయలేదు.. కాకపోతే ఊహించుకోవాలని వదిలి పెట్టేశారు మాజీ మంత్రి.  ఓ విధంగా చెప్పాలంటే పవన్‌ని  ఉద్దేశించి అంబటి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

ALSO READ: ప్రభుత్వ స్కూల్ టెన్త్ టాపర్లకు అపూర్వ గౌరవం.. గన్నవరం నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ జర్నీ

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. కూటమి మరో పదేళ్లు ఇలాగే కొనసాగాలని తాను బలంగా కోరుకుంటున్నానని అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. వైసీపీలో ఏదో చిన్న ఆశ. కూటమిని విడగొడితే రూలింగ్‌లోకి రావచ్చని ఆశపడుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, కూటమిని విచ్ఛిన్నం చేసేపనిలో పడిందని అంటున్నారు నేతలు.

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×