E-Paper
Advertisement

ఏపీలో SIR ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. పూర్తి వివరాలు వెల్లడించిన సీఈవో

ఏపీలో SIR ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. పూర్తి వివరాలు వెల్లడించిన సీఈవో
Advertisement

Draft Voters: ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ఎన్నికల సంఘం అత్యంత కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితా విడుదలైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా, తప్పులను సరిదిద్దే ఉద్దేశంతో ఈ కసరత్తును కొనసాగిస్తున్నారు.

ముసాయిదా జాబితా ముఖ్యాంశాలు

Advertisement

రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లను పరిశీలించగా.. ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించిన 3.71 కోట్ల మందితో తాజా డ్రాఫ్ట్ జాబితాను సిద్ధం చేశారు. ఈ పరిశీలనలో మరణించిన 15.22 లక్షల మందితో పాటు, రెండు చోట్ల ఓట్లు కలిగి ఉన్న 7.37 లక్షల మందిని గుర్తించి మొత్తం 44.89 లక్షల పేర్లను తొలగించారు. అయితే, ఎలాంటి నోటీసు లేదా సరైన విచారణ లేకుండా ఏ ఒక్కరి పేరునూ తొలగించబోమని సీఈవో స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీలతో భేటీ

Advertisement

ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు వచ్చే నెల 4న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఈ భేటీలో పార్టీలకు ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీలను అందజేస్తారు. ముసాయిదా జాబితాలో మీ పేరు లేకపోయినా లేదా ఏవైనా తప్పులు ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులైన వారు ‘ఫామ్-6’ ద్వారా కొత్తగా పేరు నమోదు చేసుకోవడానికి ఆగస్టు 31 వరకు అవకాశం ఉంది.

ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలపై విచారణ జరుపుతారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేసిన తర్వాత అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు.

Also Read: ‘తుడిచేవాడు కూడా ఓనర్ అయ్యాడు’.. ప్రైవేట్ ట్రావెల్స్‌పై జేసీ హాట్ కామెంట్స్!

Related News

రూటు మార్చిన విజయసాయిరెడ్డి.. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు, అసలు వీక్‌నెస్ అదే

‘తుడిచేవాడు కూడా ఓనర్ అయ్యాడు’.. ప్రైవేట్ ట్రావెల్స్‌పై జేసీ హాట్ కామెంట్స్!

యువతిని చంపి సూట్‌కేసులో కుక్కేసి.. ఒడిషాలో పడేశాడు ప్రియుడు, విశాఖలో దారుణమైన ఘటన

ప్రధాని మోదీ భోగాపురం షెడ్యూల్ ఇదిగో.. భారీ ఎత్తున ఏర్పాట్లు, 17న సింగపూర్‌కు తొలి విమానం

నేడు తెలంగాణలో వర్షాలు, ఏపీలో పిడుగుల‌తోపాటు, మరి హైదరాబాద్ మాటేంటి?

వైఎస్ ఫ్యామిలీలో విషాదం.. జగన్ పెదనాన్న మృతి, పులివెందులకు మాజీ సీఎం

తెలిసో తెలియకో యాక్సిడెంట్ చేశాడు.. దీన్ని కుట్ర అంటున్నారు: జగన్

Big Stories

Advertisement
×