E-Paper
Advertisement

ఏపీలో SIR ముసాయిదా ఓటర్ల జాబితా ఇదే.. లక్షల్లో ఓట్ల గల్లంతు, మీ పేరు లేకపోతే?

ఏపీలో SIR ముసాయిదా ఓటర్ల జాబితా ఇదే.. లక్షల్లో ఓట్ల గల్లంతు, మీ పేరు లేకపోతే?
Advertisement

Draft Voters: ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ఎన్నికల సంఘం అత్యంత కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితా విడుదలైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా, తప్పులను సరిదిద్దే ఉద్దేశంతో ఈ కసరత్తును కొనసాగిస్తున్నారు.

ముసాయిదా జాబితా ముఖ్యాంశాలు

Advertisement

రాష్ట్రంలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లను పరిశీలించగా.. ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించిన 3.71 కోట్ల మందితో తాజా డ్రాఫ్ట్ జాబితాను సిద్ధం చేశారు. ఈ పరిశీలనలో మరణించిన 15.22 లక్షల మందితో పాటు, రెండు చోట్ల ఓట్లు కలిగి ఉన్న 7.37 లక్షల మందిని గుర్తించి మొత్తం 44.89 లక్షల పేర్లను తొలగించారు. అయితే, ఎలాంటి నోటీసు లేదా సరైన విచారణ లేకుండా ఏ ఒక్కరి పేరునూ తొలగించబోమని సీఈవో స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీలతో భేటీ

Advertisement

ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు వచ్చే నెల 4న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఈ భేటీలో పార్టీలకు ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీలను అందజేస్తారు. ముసాయిదా జాబితాలో మీ పేరు లేకపోయినా లేదా ఏవైనా తప్పులు ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులైన వారు ‘ఫామ్-6’ ద్వారా కొత్తగా పేరు నమోదు చేసుకోవడానికి ఆగస్టు 31 వరకు అవకాశం ఉంది.

ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాలపై విచారణ జరుపుతారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేసిన తర్వాత అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు.

Also Read: ‘తుడిచేవాడు కూడా ఓనర్ అయ్యాడు’.. ప్రైవేట్ ట్రావెల్స్‌పై జేసీ హాట్ కామెంట్స్!

Related News

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

Big Stories

Advertisement
×