Palnadu Accident: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం పరిధిలోని నరసరావుపేట చెక్పోస్టు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ట్రావెల్ బస్సు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
స్థానికుల వివరాల ప్రకారం.. నరసరావుపేట నుంచి రొంపిచర్ల వైపు ఇద్దరు వ్యక్తులు తమ బైక్పై బయలుదేరారు. ఈ క్రమంలో చెక్పోస్టు సమీపంలోకి రాగానే, రహదారిని దాటేందుకు యత్నించారు. అదే సమయంలో ఎదురుగా వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు బైక్ను బలంగా ఢీకొట్టింది.
బస్సు ఢీకొన్న తీవ్రతకు బైక్పై ఉన్న ఇద్దరు తీవ్ర గాయాలపాలై తీవ్ర రక్తస్రావంతో ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, వారి గుర్తింపు వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. హోటల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు!