Nandyal JE: నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం రేపుతోంది. కొలిమిగుండ్ల విద్యుత్ JE చింతా లక్ష్మణస్వామి ఈ నెల 8న ఆఫీస్ పనిమీద ఇంటినుంచి బయటకు వెళ్లారు. అప్పటినుంచి తిరిగి ఇంటికి రాలేదు. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో ఏమైందోనని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
16 ఏళ్లుగా ఒకే చోట ఉద్యోగం..
కొలిమిగుండ్ల విద్యుత్ సబ్స్టేషన్లో 16 ఏళ్లుగా లక్ష్మణస్వామి జేఈగా విధులు నిర్వహిస్తున్నారు. 8వ తేదీ రాత్రి కారు తీసుకుని ప్రమోషన్ ఉందంటూ, సంబంధిత పత్రాలు తిరుపతిలో సమర్పించాలని ఇంటి నుంచి బయలుదేరారు. అయితే ఆదివారం నుంచే లక్ష్మణస్వామి మూడీగా ఉన్నారన్న ఆయన భార్య లీలావతి తెలిపారు. ఆఫీస్లోనే ఏదో జరిగిందని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భార్య ఫిర్యాదుతో కేసు నమోదు
భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలా? లేక విధి నిర్వహణలో ఒత్తిడా? అనే కోణంలోనూ ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజీ, కాల్ డేటా సైతం పరిశీలిస్తున్నారు.
Also Read: KTR, హరీష్రావులకు గద్దర్ అవార్డులు గ్యారెంటీ.. మాక్ అసెంబ్లీపై మెట్టు సాయికుమార్ సెటైర్లు!