E-Paper
Advertisement

YCP Incharges : ఎమ్మెల్యే అభ్యర్థులపై సీఎం జగన్ కసరత్తు.. ఆ కీలక నేతలకు పిలుపు..

YCP Incharges : ఎమ్మెల్యే అభ్యర్థులపై సీఎం జగన్ కసరత్తు.. ఆ కీలక నేతలకు పిలుపు..
Advertisement

YCP Incharges : వైఎస్‌ఆర్‌సీపీ ఇన్ చార్జ్‌ల మార్పుపై కసరత్తు కంటిన్యూ అవుతోంది. సీఎం జగన్‌ పిలుపుతో తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయానికి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, విజయవాడ తూర్పు నియోజకవర్గ నేత దేవినేని అవినాష్‌లకు పిలుపు వచ్చింది.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల మార్పులపై సీఎం జగన్ వారితో చర్చించారు. నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఇంచార్జీలను ఖరారు చేయనున్నారు. మరోవైపు సీఎం కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రావడం చర్చనీయాంసమైంది. గిద్దలూరు సహా ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల ఇంచార్జీల మార్పుపై సీఎంతో చర్చించనున్నారు బాలినేని.

Advertisement

ఏపీలో మార్పులు చేర్పులతో వైసీపీ నేతలకు టెన్షన్‌ పట్టుకుంది. ఎవరి సీటుకు ఎసరు పడుతుందో తెలియని పరిస్థితితో ఆందోళనలో ఉన్నారు. లోపల అసంతృప్తి ఉన్నా సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌ సీఎం జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని స్పష్టం చేశారు. సీఎంవో నుంచి పిలుపు రావడంతోనే తాను ముఖ్యమంత్రిని కలిశానన్నారు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పనులు, నిధుల గురించి చర్చించానని తెలిపారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×