Garuda Scheme In AP: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 18 నెలలు గడిచింది. అన్నివర్గాల వారికి పథకాలు ప్రవేశపెట్టింది. ముఖ్యంగా మహిళలకు గురించి చెప్పనక్కర్లేదు. తాజాగా గరుడ పథకం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. పేద బ్రాహ్మణ కుటుంబాల సంక్షేమం కోసం ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోంది.
ఏపీలో కొత్తగా గరుడ పథకం
బ్రాహ్మణ కుటుంబాల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ‘గరుడ పథకం పేరుతో ఓ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబాలకు భరోసా కల్పించడం ముఖ్య ఉద్దేశం.
బ్రాహ్మణ కుటుంబంలో ఎవరు మృతి చెందినప్పుడు వారి అంత్యక్రియలు , సంప్రదాయ ఆచారాల నిర్వహణకు ఆర్థిక సహాయం చేయనుంది. ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల కుటుంబానికి ఇవ్వనుంది. గరుడ పథకం అమలు ఇంకా ఎలాంటి ప్రయోజనాలు దక్కనున్నాయి.
బ్రహ్మణ పేద కుటుంబానికి ఆర్థిక సహాయం
అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆర్థిక సహాయం అందించనుంది. వారు ఏపీకి చెందినవారై ఉండాలి. అలాగే పేద బ్రాహ్మణ కుటుంబం అయి ఉండాలి. ప్రభుత్వ విధించనున్న మార్గదర్శకాల ప్రకారం.. ఆదాయ అర్హత కలిగి ఉండాలి. దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది.
పేద బ్రాహ్మణ కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఆకస్మిక మరణాల సమయంలో ఖర్చులను తట్టుకునేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగం ఉండనుంది. గరుడ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయనుంది.
ALSO READ: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. తెలంగాణపై కొత్త పలుకులు
ఏపీ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లేకుంటే బ్రాహ్మణ కార్పొరేషన్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దరఖాస్తు విధానంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సివుంది. ఆన్లైన్ ద్వారా లేకుంటే బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. ఆధార్ కార్డు, ఆదాయ-కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి. అలాగే ప్రభుత్వం జారీ చేసే డెత్ సర్టిపికెట్ తప్పనిసరి. పథకం అమలపై త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది ప్రభుత్వం.