BigTV English

AP Politics : పీసీసీ చీఫ్‌ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా.. షర్మిలకే ఆ పగ్గాలు..?

AP Politics : పీసీసీ చీఫ్‌ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా.. షర్మిలకే ఆ పగ్గాలు..?

AP Politics : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆంధ్ర ప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు(Gidugu Rudraraju) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన వైఎస్ షర్మిల(YS Sharmila)కు పీసీసీ పదవి ఇచ్చే అవకాశముంది.


పార్టీలో చేరిన తర్వాత YS షర్మిలకు ఏ పదవి ఇస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు నేటితో తెరపడినట్టు అయింది. ఆమెకు APCC చీఫ్‌ పదవి ఇస్తారని ప్రచారమైతే జరుగుతోంది. అందులోభాగంగా గిడుగు రాజీనామా చేశారని తెలుస్తోంది.

తెలంగాణ విజభన తర్వాత ఏపీలో పూర్తిగా కనుమరుగైపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణలో గెలుపు ఉత్సాహంతో అక్కడ కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం వైఎస్ షర్మిలను ఏపీ రాజకీయాల్లో ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. వైఎస్‌పై ఉన్న సానుభూతి, అభిమానం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయని హై కమాండ్ ఆలోచిస్తోంది.అందుకే ఆమెకు APCC చీఫ్‌ పదవి ఇవ్వాలని డిసైడయింది. ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పోటీగా షర్మిలకు కీలక బాధ్యలు అప్పగించి ఆమె సేవలను వాడుకోవాలని హస్తం పార్టీ చూస్తోంది.


Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×