E-Paper
Advertisement

Dead Body Parcel Case: వదిన కోసం.. బాడీ పార్శిల్ కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు

Dead Body Parcel Case: వదిన కోసం.. బాడీ పార్శిల్ కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
Advertisement

Dead Body Parcel Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డెడ్ బాడీ పార్శిల్ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరిగింది. సినిమాను తలపించే సస్పెన్స్, థ్రిల్లింగ్ ట్వి్స్టులతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలోని తన వదినకు.. చెక్కపెట్టెలో డెడ్ బాడీ పార్శిల్ చేశాడు శ్రీధర్ వర్మ. ఆస్తి కోసమే వదిన తులసిని బెదిరించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

భార్య రేవతి, ప్రియురాలు సుష్మతో కలిసి శ్రీధర్ వర్మ స్కెచ్ వేసినట్లు ఎంక్వైరీలో తేలింది. శ్రీధర్ వర్మ తన వదిన తులసి ఆస్తి కొట్టేందుకు దాదాపు జులై నుంచే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న శ్రీధర్ వర్మ తన వదిన తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్స్ అందిస్తున్నట్లు కథ నడిపించాడు.

Advertisement

అదే సమయంలో మెటీరియల్స్ పేరుతో శవాన్ని పంపి తులసిని భయపెట్టాలని చూశారు. దీంతో మొదట ఎక్కడ నుంచైనా శవాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అది కుదరకపోవడంతో అమాయకుడైన బర్రె పర్లయ్యను చంపేశారని తేలింది. ఇద్దరితో కలిసి బర్రె పర్లయ్యను హత్య చేసినట్లు విచారణలో శ్రీధర్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. శవాన్ని ఇంటికి పార్శిల్ చేసి వదిన తులసిని భయపెట్టాలని స్కెచ్ వేసినట్లు చెప్పారు.

ఆస్తి పత్రాలపై సంతకం పెడతావా చస్తావా అంటూ భార్య రేవతితో కలిసి తులసిని బెదిరించారు. ఇప్పటికే పోలీసుల అదుపులో ప్రియురాలు సుష్మ, చిన్నఅల్లుడు శ్రీధర్ వర్మ, చిన్న కూతురు రేవతి ఉన్నారు. ఇవాళ మీడియా ముందుకు డెడ్ పార్శిల్ కేసు ప్రధాన నిందితులను ప్రవేశపెట్టనున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి శ్రీధర్ వర్మ 40 సిమ్స్ మార్చినట్లు గుర్తించారు. ఇక శ్రీధర్ వర్మ అకౌంట్లో 2 కోట్లు గుర్తించారు.

Advertisement

Also Read: పట్టుబడ్డ ‘ పార్సిల్’ నిందితులు.. ఎట్టకేలకు కేసును చేధించిన పోలీసులు.. ఎవరిది ఈ క్రూర ఆలోచన అంటే..

పర్లయ్య అనే వ్యక్తిని హత్య చేసి.. అతని శవాన్ని చెక్కపెట్టెలో పెట్టి.. కోటి 30 లక్షలు చెల్లించాలని లేఖ పంపిస్తే.. తులసి భయాందోళనకు గురై తన మాట వింటుందని శ్రీధర్ ప్లాన్ వేశారు. పక్కా ప్రకారమే పర్లయ్యను హత్యచేసి.. అతని డెడ్ బాడీని పార్శిల్ చేసి వదిన తులసి ఇంటికి పంపాడు. అదేరోజు ఆస్తి పత్రాలపై సంతకాలు సేకరించే ప్రయత్నం చేశాడు శ్రీధర్. అయితే అప్రమత్తమైన తులసి వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చింది. బంధువులు వస్తే పోలీసులకు అసలు విషయం తెలిసిపోతుందని శ్రీధర్ వర్మ అక్కడి నుంచి పరారయ్యాడు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×