BigTV English
Advertisement

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

Vontimitta By Election: ఓంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో ఒక దశలో పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారాయి. చిన్నకొత్తపల్లి గ్రామంలోని 7వ పోలింగ్ బూత్ వద్ద జరిగిన సంఘటనలతో రాజకీయ ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. ఉదయం మొదట్లో అన్నీ సజావుగానే సాగుతున్నాయి. కానీ, మధ్యాహ్నం సమయంలో ఒక సమాచారం ఊరంతా కలకలం రేపింది. వైసీపీ ఏజెంట్లు బూత్‌లోకి వెళ్లి దొంగ ఓట్లు వేస్తున్నారన్న వార్త బయటకు వచ్చింది. ఈ సమాచారం నేరుగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి చెవిన పడటంతో, ఆయన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.


మంత్రి రాకతో అక్కడి వాతావరణం మరింత ఉద్రిక్తమైంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగారు. మాటల దాడులు కాసేపట్లో చేతుల దాడులుగా మారాయి. పిడిగుద్దులు, తన్నులు, తోసుకోవడం  ఇరువర్గాలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విరుచుకుపడ్డారు. బూత్ పరిసరాలు కాసేపు యుద్ధరంగాన్ని తలపించాయి.

ఈ సంఘటనతో పోలింగ్ కేంద్రం వద్దకు మరింత గుంపులు చేరడంతో ఉద్రిక్తత పెరిగింది. అటు బూత్‌లో పోలింగ్ సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మొదట ఇరువర్గాలను మాటలతో సమాధాన పరచాలని ప్రయత్నించినా, గొడవ ఆగకపోవడంతో బలప్రయోగానికి దిగారు. లాఠీలతో చెదరగొట్టిన పోలీసులు, ఇరువర్గాలను వేరుచేసి శాంతి వాతావరణాన్ని నెలకొల్పారు.


ఈ ఘటన తర్వాత అక్కడ భద్రతా బందోబస్తు మరింత పెంచారు. అదనపు పోలీసులు కూడా నియమించారు. పోలింగ్ ప్రక్రియకు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక పహారా కొనసాగించారు. ఇక, ఈ ఘర్షణపై టీడీపీ, వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నం జరిగిందని, అందుకే ప్రతిఘటించామని టీడీపీ ఆరోపిస్తే… తాము ఏ తప్పూ చేయలేదని, ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించిందని వైసీపీ వర్గం అంటోంది. మొత్తం మీద, ఈ చిన్నకొత్తపల్లి బూత్ ఘటన ఉప ఎన్నికల వేడిని మరింత పెంచింది. ఇరు పార్టీల మధ్య ఆరోపణలు, ప్రతియారోపణలు కొనసాగుతుండగా, ఈ ఘర్షణ భవిష్యత్తులో రాజకీయంగా ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి.

Related News

Top 20 News Today: సుపారీ గ్యాంగ్‌తో కొడుకును హత్య చేయించిన తల్లి, తిరుపతిలో రెడ్ అలర్ట్

Top 20 News Today: జగన్‌పై రామానాయుడు సంచలన వ్యాఖ్యలు, భద్రతా బలగాలను చుట్టుముట్టిన మావోయిస్టులు

Indian Student Dead: అమెరికాలో ఆంధ్రా అమ్మాయి మృతి, అసలు ఏం జరిగిందంటే?

CM Chandrababu In Prakasam: త్వరలో కనకపట్నం.. మా టార్గెట్ అదే, ప్రకాశం జిల్లా టూర్‌లో సీఎం చంద్రబాబు

Top 20 News Today: ఛీ.. ఛీ.. పాఠశాల వద్ద కండోమ్ ప్యాకెట్లు.. తమిళనాడులో ఎగిరిపడ్డ సిలిండర్లు

Tirumala Adulterated Ghee case: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు.. వైవీ సుబ్బారెడ్డికి పిలుపు

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Big Stories

×