E-Paper
Advertisement

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Loan app scam: సాధారణంగా లోన్ యాప్ అంటే.. డబ్బు అవసరమైనప్పుడు కొంత మొత్తం తీసుకుని, సమయానికి వడ్డీతో పాటు తిరిగి చెల్లించడం. కానీ ఈ ముఠా మాత్రం పూర్తిగా వేరే పద్ధతి ఎంచుకుంది. అసలు డబ్బు ఇవ్వకుండానే బాధితులను భయపెట్టి, బెదిరించి, వారి నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టింది. ఇంతే కాదు, కొందరికి ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి, కుటుంబ సభ్యులకు, బంధువులకు షేర్ చేస్తామని బెదిరించడం కూడా వీరి నిత్యకృత్యమైంది.

ఒక యువతి అయితే ఒక్క రూపాయి లోన్ కూడా తీసుకోకుండా ఏకంగా రూ. 15 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. మరొక యువకుడు, కేవలం రూ. 2000 లోన్ తీసుకుని దానికి బదులుగా రూ. 12 లక్షలు కట్టాడు. ఇది విన్నవారికి షాక్ తగలక మానదు.

ముఠా పాపం పండింది
ఏపీలోని విశాఖ పోలీసులు ఈ ముఠా అతి చివరికి పట్టు బిగించారు. మంగళవారం 20 మందిని అరెస్ట్ చేసి, నేరానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. వీరిలో కొందరు ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా, మరికొందరు ఇతర రాష్ట్రాలు, కొన్ని విదేశాల్లో కూడా కార్యకలాపాలు సాగించారు. పోలీసుల ప్రత్యేక బృందం ఈ గ్యాంగ్‌ను దశలవారీగా ట్రాక్ చేసి, ఎట్టకేలకు కటకటల వెనక్కి నెట్టింది.

బాధితుల విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజాలు
పోలీసులు అరెస్ట్ చేసిన ఈ గ్యాంగ్ గురించి విచారణ జరిపితే, వీరు ఎవరినీ వదలరని తెలిసింది. సాధారణ ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు.. ఇలా ఎవరికైనా యాప్ ద్వారా సంప్రదించి, లోన్ మంజూరైందని చెబుతారు. ఆ తర్వాత అసలు డబ్బు ఇవ్వకముందే, ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్ ఛార్జీలు అంటూ కొంత మొత్తాన్ని అడుగుతారు. డబ్బు ఇచ్చాక కూడా కొత్త కొత్త కారణాలు చెప్పి, మరింత మొత్తం డిమాండ్ చేస్తారు.

ఎవరో డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే, వారి ఫోన్ గ్యాలరీలో ఉన్న ఫోటోలు, కాంటాక్ట్స్ తీసుకుని, వాటిని మార్ఫింగ్ చేసి, బంధువులకు షేర్ చేస్తామని బెదిరిస్తారు. ఈ భయంతో బాధితులు అప్పు తీసుకోకపోయినా పెద్ద మొత్తాలు చెల్లించాల్సి వచ్చింది.

క్రిప్టో ద్వారా డబ్బు సఫాయి
ఈ గ్యాంగ్ సంపాదించిన డబ్బు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్లదు. ముందుగా వివిధ పద్ధతుల్లో క్రిప్టోకరెన్సీగా మార్చి, తర్వాత మళ్లీ రూపాయలుగా మార్చుకుంటారు. ఈ విధానం వల్ల ట్రేస్ చేయడం కష్టం అవుతుంది. కానీ విశాఖ పోలీసులు ఈ క్రిప్టో ట్రాన్సాక్షన్లను ట్రాక్ చేసి, చివరకు దొంగల అడ్డాలను గుర్తించారు.

విశాఖ సీపీ శంకబ్రత బాగ్చీ యాక్షన్
పోలీసు కమిషనర్ శంకబ్రత బాక్సీ స్వయంగా ఈ కేసును పర్యవేక్షించారు. మొత్తం రూ. 50 లక్షల వరకు బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును తిరిగి రాబట్టి, వందమంది బాధితులకు చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. ఈ డబ్బు తిరిగి వస్తుందని ఎప్పుడూ ఊహించని బాధితుల కళ్లల్లో ఆనందం కనిపించింది.

Also Read: Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

మానసిక ఒత్తిడి.. ఆత్మహత్యాయత్నాలు
ఇలాంటి ముఠాల బెదిరింపుల వల్ల కొందరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై, ఆత్మహత్యాయత్నాలు చేశారు. వారి కుటుంబాలు, స్నేహితులు క్షణం కూడా ప్రశాంతంగా గడపలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో బయటపడిన నిజాలు చూస్తే, ఇన్‌స్టంట్ లోన్ యాప్ మోసాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది.

పోలీసుల హెచ్చరిక
తెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు
వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, కాంటాక్ట్స్‌కు యాక్సెస్ ఇవ్వవద్దు
లోన్ అవసరమైతే, బ్యాంకులు లేదా నమ్మకమైన ఫైనాన్స్ కంపెనీల ద్వారా మాత్రమే తీసుకోండి
ఎవరైనా బెదిరిస్తే, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించండి

సులభంగా డబ్బు వస్తుందని నమ్మి తెలియని యాప్‌లకు అవకాశం ఇస్తే, మన గోప్యత, డబ్బు రెండూ ప్రమాదంలో పడతాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ముందు, దాని రిస్క్‌లను అర్థం చేసుకోవాలి. ఈ 20 మంది అరెస్ట్ కావడం కేవలం విశాఖకే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టంట్ లోన్ యాప్ ముఠాలకు పెద్ద దెబ్బ. ప్రజలు అప్రమత్తంగా ఉంటే, ఇలాంటి మోసాలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు.

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×