E-Paper
Advertisement

Boy Murder : పదో తరగతి బాలుడిపై పెట్రోల్ పోసి .. నిప్పు పెట్టి.. ఏపీలో దారుణహత్య..

Boy Murder :  పదో తరగతి బాలుడిపై పెట్రోల్ పోసి .. నిప్పు పెట్టి.. ఏపీలో దారుణహత్య..
Advertisement

Boy burnt latest news(Breaking news in Andhra Pradesh): బాపట్ల జిల్లాలో దారుణ హత్య జరిగింది. అమర్నాథ్‌ అనే పదో తరగతి విద్యార్ధిపై స్నేహితుడే పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. చెరుకుపల్లి మండలం రాజోలులో ఈ దారుణ ఘటన జరిగింది. అమర్నాథ్ ఉదయం ట్యూషన్‌కు వెళుతుండగా బాలుడి స్నేహితుడు వెంకటేశ్వరరెడ్డి మరికొందరితో కలిసి ఈ దారుణ చర్యకు పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అమర్నాథ్‌ను వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement

అమర్నాథ్ స్వస్థలం చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీ పరిధి ఉప్పలవారిపాలెం. ఆ బాలుడు స్థానిక ఉన్నత పాఠశాలలో టెన్త్ చదువుతున్నాడు. రోజూ ఉదయం రాజోలులో ట్యూషన్‌కు వెళుతుంటాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం వెళుతుండగా మార్గంమధ్యలో రెడ్లపాలెం వద్ద వెంకటేశ్వరరెడ్డి మరి కొందరితో కలిసి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.

మంటలు అంటుకోవడంతో బాధితుడు హాహాకారాలు చేశాడు. ఆ అరుపులు విని స్థానికులు వెంటనే మంటలు ఆర్పారు. అతడిని చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తనపై వెంకటేశ్వర్‌రెడ్డి మరికొందరుతో కలిసి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడని పోలీసులకు బాధితుడు వాంగ్మూలం ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై చెరుకుపల్లి ఎస్ఐ కొండారెడ్డి కేసు నమోదు చేశారు. బాలుడి హత్యపై దర్యాప్తు చేపట్టారు.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×