BigTV English
Advertisement

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్.. బైకర్ పై ఎర్రిస్వామి ఫిర్యాదు.. మద్యం కొనుగోలు వీడియో వైరల్

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్.. బైకర్ పై ఎర్రిస్వామి ఫిర్యాదు.. మద్యం కొనుగోలు వీడియో వైరల్

Kurnool Bus Accident: కర్నూలు బస్సు దగ్ధం దుర్ఘటనలో 19 మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణమైన బైక్ ను నడిపిన శివశంకర్ పై అతడి స్నేహితుడు ఎర్రిస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివశంకర్ పై ఎర్రిస్వామి ఉలిందకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శివశంకర్‌ నిర్లక్ష్యం కారణంగానే బైక్‌ డివైడర్‌ను ఢీకొట్టిందని తన ఫిర్యాదులో ఎర్రిస్వామి పేర్కొన్నాడు.


ప్రమాదానికి ముందు తాను, శివ శంకర్ మద్యం సేవించినట్లు ఎర్రిస్వామి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల బైక్ డివైడర్ ను ఢీకొట్టిందని తెలిపారు. శివశంకర్ స్పాట్ లో చనిపోగా, తాను గాయాలతో బయట పడ్డానని చెప్పుకొచ్చారు. శివశంకర్ మృతదేహాన్ని పక్కకు తీసేందుకు ప్రయత్నించానని పేర్కొన్నారు. అయితే, తమ బైక్ ను మరో వాహనం ఢీకొట్టడంతో.. బైక్ రోడ్డు మధ్యలో పడిందన్నారు. కాసేపటికి బస్సు బైకును లాక్కెళ్లిందని ఎర్రిస్వామి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బస్సులో మంటలు చెలరేగి ప్రమాదం జరిగిందని వివరించారు.

మద్యం కొనుగోలు.. సీసీ ఫుటేజీ వైరల్

కర్నూలు బస్సు ప్రమాదంపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక సమర్పించింది. దీని ప్రకారం శివ శంకర్ మృత దేహం నుంచి సేకరించిన నమూనాల్లో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో మద్యం తాగి వాహనం నడిపినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. శివశంకర్, ఎర్రిస్వామికి సంబంధించిన మరో సీసీటీవీ వీడియో బయటపడింది. ప్రమాదానికి ముందు పెద్దటేకూరులోని ఓ వైన్స్ లో గురువారం రాత్రి 7 గంటలకు ఒకసారి, 8.25 మరోసారి వీరిద్దరూ మద్యం కొనుగోలు చేసినట్లు రికార్డు అయింది. ఈ సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతుంది.


ఆర్టీఏ తనిఖీలు

కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ఆర్టీఏ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. నంద్యాల జిల్లాలో ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే 66 కేసులు నమోదు చేసి రూ. 28,400 జరిమానా విధించారు. పల్నాడు జిల్లాలో 36 కేసులు పెట్టి రూ. 2,50,700 ఫైన్ విధించారు. ప్రకాశం జిల్లాలో 34 కేసులు పెట్టి రూ. 89,810 జరిమానా విధించారు. తిరుపతి జిల్లాలో 25 కేసులు నమోదు చేసి రూ. 2,40,000 జరిమానా విధించారు. చిత్తూరు జిల్లాలో 8 కేసులు, కర్నూలు జిల్లాలో 14 కేసులు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 42 కేసులు పెట్టి, నిబంధనలు ఉల్లంఘించిన ఓ బస్సును సీజ్ చేశారు.

Also Read: Maharashtra News: భార్యాభర్తల మధ్య గొడవ.. కోపంతో ఫారెస్టులోకి, కవలల గొంతు కోసిన తండ్రి

కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగింత

కర్నూలు బస్సు దగ్ధం కేసులో మృతి చెందిన వారిలో 18 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. డీఎన్‌ఏ పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలు అందించారు. డెట్ సర్టిఫికెట్లు, ఇతర ప్రక్రియను కర్నూలు జిల్లా కలెక్టర్‌ ఎ.సిరి పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు.

Related News

Stray Dogs Attack: ఘోరం! బాలికపై వీధి కుక్కలు మూకుమ్మడి దాడి.. సీసీ కెమెరాల్లో రికార్డ్

Husband Suicide: ఇంట్లో అత్త ఉండొద్దని భార్య గొడవ.. 15 వ అంతస్తు నుంచి దూకి భర్త ఆత్మహత్య

Maharashtra News: భార్యాభర్తల మధ్య గొడవ.. కోపంతో ఫారెస్టులోకి, కవలల గొంతు కోసిన తండ్రి

Love Failure: ప్రేమలో ఓడిపోయాను.. యువకుడి ఆత్మహత్య సెల్ఫీ వీడియో

Hyderabad News: హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద కారు బీభత్సం.. డివైడర్, బైక్‌ని ఢీ కొట్టి, కారులో ముగ్గురు

Uttar Pradesh Crime: మంత్ర విద్య.. పిల్లలను చింపేసిన తల్లి, ఆ తర్వాత ఆమె కూడా

Mysuru News: బాత్రూమ్‌లో గ్యాస్ గీజర్.. అక్కాచెల్లెళ్లను చంపేసింది, అమేటరేంటి?

Big Stories

×