E-Paper
Advertisement

Amaravati News: ప్రమాదకరంగా ‘బ్లూ బ్యాచ్’.. మంత్రి లోకేష్ సూచన, రంగంలోకి పోలీసులు?

Amaravati News: ప్రమాదకరంగా ‘బ్లూ బ్యాచ్’.. మంత్రి లోకేష్ సూచన, రంగంలోకి పోలీసులు?
Advertisement

Amaravati News: సోషల్‌ మీడియా పుణ్యమాని తప్పుడు వార్తల ప్రచారం జోరందుకుంది. దీనిపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నా, కొందరు ఏ మాత్రం వినడం లేదు. ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. సమాజానికి హానికరంగా మారిన బ్లూ బ్యాచ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు.

‘బ్లూ బ్యాచ్’పై మంత్రి ఆగ్రహం

Advertisement

ఏపీలో అధికారంలోకి వచ్చిన నుంచి కూటమి ప్రభుత్వంపై ఒకటే విమర్శలు. రాతలు, వీడియోలు కట్ పేస్ట్ చేసి నానాహంగామా చేస్తున్నారు కొందరు. అంతేకాదు కులాల మధ్య గొడవలు పెట్టారు.. ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నారు కూడా.  కూటమి సర్కార్ పదేపదే చెబుతున్నా, ఏ మాత్రం వినడం లేదు.

ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ ఓ పోస్టు పెట్టారు. తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేద్దామనుకుంటున్న ‘బ్లూ బ్యాచ్’ సమాజానికి ప్రమాదకరంగా మారిందనడంలో సందేహం లేదన్నారు. రాష్ట్రంలోని ఓ గురుకుల పాఠశాలలో 2023 నాటి పరిస్థితికి సంబంధించిన వీడియోను తాజాగా అరకు‌లో జరిగినట్లు ఒక కథనం రాసింది వైసీపీ అనుబంధ సోషల్ మీడియా. దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

Advertisement

రంగంలోకి పోలీసులు

ఈ వార్తపై ప్రభుత్వం తరపున ‘ఫ్యాక్ట్ చెక్’లో సంపూర్ణ వివరాలతో సమాచారం అందించింది. దీంతో కొద్దిరోజులు సైలెంట్ అయ్యింది. మళ్లీ అదే వీడియోతో తాజాగా తప్పుడు ప్రచారం మొదలుపెట్టేసింది. ఈ వ్యవహారం నేరుగా మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లింది. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిని ‘హ్యాబిట్యువల్ అఫెండర్స్’ (నేరాలు చేయడానికి అలవాటు పడ్డవారు) అంటారు.

అది ఒక రాజకీయ పార్టీనా హ్యాబిట్యువల్ అఫెండర్స్ ముఠానా? అనే అనుమానం వస్తుందన్నారు. ఈ ఫేక్ ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మవద్దని, అలాంటి ప్రచారాలు చేసేవారిపై చర్యలు తీసుకోవలసిందిగా @APPOLICE100 వారిని కోరారు.  ఆ పోస్టును ఏపీ పోలీసులకు ట్యాగ్ చేశారు. దీనిపై పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

ALSO READ: న్యూఇయర్‌కి ముందే.. కూటమి కొత్త ప్లానేంటి?

ఆ పోస్టు ఎక్కడ నుంచి అప్‌లోడ్ అయ్యింది? అనేదానిపై కూపీ లాగుతున్నారు. దీనికి సంబంధించి రేపో మాపో అరెస్టులు ఖాయమని అంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలా రాజకీయ పార్టీలు విదేశాల నుంచి పోస్టింగులు పెడుతున్నారు. మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

 

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×