E-Paper
Advertisement

AP Heavy Rains: ఏపీకి మొంథా తుపాను ముప్పు.. బాంబ్ పేల్చిన వాతావ‌ర‌ణ శాఖ‌

AP Heavy Rains: ఏపీకి మొంథా తుపాను ముప్పు.. బాంబ్ పేల్చిన వాతావ‌ర‌ణ శాఖ‌
Advertisement

AP Heavy Rains: ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను ఏపీ వైపూ దూసుకొస్తుందని పేర్కొంది. తుపాను ఏపీలో తీరం దాటే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

విశాఖకు సమీపంలో వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 3 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో వాయుగుండం కదులుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయుగుండం ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 440 కి.మీ, విశాఖపట్నానికి 970 కి.మీ, చెన్నైకి 970 కి.మీ, కాకినాడకి 990 కి.మీ, గోపాల్‌పూర్ కి 1040 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించింది.

కాకినాడ సమీపంలో

Advertisement

వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపటికి తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండి(సోమవారం) ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం(అక్టోబర్ 28) రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఈ నెల 28న తీరం దాటనున్న తుపాను

తుపాను తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న నాలుగు రోజులు(అక్టోబర్ 26-29) ఏపీలోని పలు జిల్లాలపై తుపాను తీవ్ర అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 28న రాత్రికి కాకినాడ సమీపంలో తీవ్రమైన తుపాను తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

తెలంగాణపై ఎఫెక్ట్

Advertisement

తుపాను ప్రభావంతో విశాఖ నుంచి తిరుపతి వరకూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా చేస్తుంది. హైదరాబాద్‌ సహా తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Also Read: AP Cyclone Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం.. 27నాటికి తుపానుగా మారే అవకాశం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

విద్యాసంస్థలకు సెలవులు

తుపాను ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో ఈ నెల 28, 29 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ప్రయాణాలు మానుకోవాలని కోరారు. మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, గోదావరి, ఏలూరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×