E-Paper
Advertisement

Bridge : ఇచ్ఛాపురంలో కుప్పకూలిన వంతెన.. ప్రమాదం ఎలా జరిగిందంటే..?

Bridge : ఇచ్ఛాపురంలో కుప్పకూలిన వంతెన.. ప్రమాదం ఎలా జరిగిందంటే..?

Bridge : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బాహుదా నదిపై ఉన్న పురాతన వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. గ్రానైట్‌ రాళ్ల లోడుతో లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాలోని అస్కా నుంచి ఒంగోలుకు 70 టన్నుల గ్రానైట్‌ రాళ్ల లోడుతో లారీ వెళుతోంది. సాధారణంగా భారీ బరువుతో వచ్చే వాహనాలు పక్కనే ఉన్న జాతీయ రహదారి పైనుంచి వెళ్తుంటాయి. కానీ గ్రానైట్‌ లోడుతో వెళ్తున్న లారీ మాత్రం ఇచ్ఛాపురం మీదుగా వచ్చింది.

వంతెనపైకి లారీ చేరుకోగానే ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో లారీ కిందికి నదిలోకి జారిపోయింది. నదిలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదే విధంగా ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపైకి ఇతర వాహనాలు రాలేదు. దీంతో ప్రాణనష్టం జరగలేదు.

బహుదానదిపై బ్రిడ్జి కూలిపోవడంతో నేరుగా ఇచ్ఛాపురంలోకి వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయంగా పోలీసులు జాతీయ రహదారి వైపు నుంచి బస్సులు, ఇతర వాహనాలను మళ్లిస్తున్నారు.
బాహుదా నదిపై ఈ వంతెనను 1929లో బ్రిటీష్‌ పాలకులు నిర్మించారు. చాలాకాలంగా బ్రిడ్జి బలహీనంగా మారింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×