BigTV English

Chandrababu : టీడీపీ- జనసేనదే అధికారం.. వైసీపీ జెండా పీకడం ఖాయం..

Chandrababu : ప్రజాకోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గరపడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్‌ ప్రజల్లోకి వస్తారని ఆయన విమర్శించారు. ప్రజాకోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గరపడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జగన్ కు అభ్యర్థులు కూడా దొరికే పరిస్థతి లేదని బాబు ఎద్దేవా చేశారు. పీలేరులో టీడీపీ నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

Chandrababu : టీడీపీ- జనసేనదే అధికారం.. వైసీపీ జెండా పీకడం ఖాయం..

Chandrababu : ప్రజాకోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గరపడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్‌ ప్రజల్లోకి వస్తారని ఆయన విమర్శించారు. ప్రజాకోర్టులో వైసీపీని శిక్షించే సమయం దగ్గరపడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జగన్ కు అభ్యర్థులు కూడా దొరికే పరిస్థతి లేదని బాబు ఎద్దేవా చేశారు. పీలేరులో టీడీపీ నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభలో చంద్రబాబు ప్రసంగించారు.


వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని చంద్రబాబు అన్నారు. ప్రజలు జగన్ పై ఉన్న కోపాన్ని ఎన్నికల సమయంలో జగన్‌పై చూపించాలన్నారు. రాబోయే యుద్ధానికి సిద్దంగా ఉన్నామన్నారు. కురుక్షేత్రంలో గెలుపు టీడీపీ, జనసేనదే అవుతుందని బాబు జోస్యం చెప్పారు. ఎన్నికల అనంతరం వైసీపీ జెండా పీకేయడం ఖాయమన్నారు. పీలేరు గర్జన రాష్ట్రం మొత్తం వినిపించాలన్నారు. జగన్‌ రాయలసీమ ద్రోహి అన్నారు. అభివృద్ది చేస్తానని కనీసం పట్టించుకునే ప్రయత్నం కూడా చేయలేదని ఆయన దుయ్యబట్టారు. గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా రాయలసీమకు తీసుకొచ్చిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు.

సాగునీటి ప్రాజెక్టులకు జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. గోదావరి మిగులు జలాలను వినియోగించుకుంటే రాయలసీమ సస్యశ్యామలమవుతుందన్నారు. జగన్ అబద్ధాల్లో పీహెచ్‌డీ చేశారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే ఆయన పాలసీ అన్నారు. అలాంటి జలగ రాష్ట్రానికి అవసరమా? అని చంద్రాబు ప్రజలను ప్రశ్నించారు.


Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×