E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

కోల్‌కతాలో కూలిన పాత గోదాం.. శిథిలాల కింద 30 మంది కార్మికులు!

కోల్‌కతాలో కూలిన పాత గోదాం.. శిథిలాల కింద 30 మంది కార్మికులు!
Advertisement

Kolkata: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పాత గోదాం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో సుమారు 30 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో లోడింగ్, అన్‌లోడింగ్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఘటన జరిగిన వెంటనే స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు (NDRF), అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. భారీ యంత్రాల సహాయంతో కాంక్రీట్ పలకలను, ఇనుప రాడ్లను తొలగిస్తూ శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం.. శిథిలాల నుంచి కొందరిని సురక్షితంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్టు సమాచారం. గోదాం భవనం బాగా పాతది కావడం, సరైన నిర్వహణ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఆందోళనతో ఘటనాస్థలికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంపై అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.

Also Read: ఏసీ బాక్స్‌కు దుమ్ముపట్టిందా? నేరుగా నీళ్లతో కడగొచ్చా? లేదా? షాకింగ్ నిజాలు!

Related News

నీటి సంపులో చిన్నారి మృతి.. తట్టుకోలేక గుండెపోటుతో నానమ్మ మృతి!

ఒక్క‌సారి మైండ్‌లో ఫిక్స‌యితే.. బ్లైండ్‌గా వెళ్లిపోవ‌డ‌మే! మ‌హిళ‌లు ఇంకా ఇంత వివ‌క్ష ఎదుర్కొంటున్నారా?

ఫ్రెండ్‌లా నమ్మించాడు.. సైకోలా చంపేశాడు.. 4 నెలల్లో 8 మందిని లేపేసిన కిల్లర్!

లాక‌ప్‌డెత్‌! తోక కుక్క‌ను ఆడిస్తోందా? పోలీసుల చేతిలో బాబు పాల‌నా? ఏపీలో అదృశ్యం మిస్ట‌రీ!

బిజినెస్‌మేన్ కేతన్ హత్య కేసులో షాకింగ్ విషయాలు.. సీన్‌లోకి సియా ప్రియుడు, కిల్లర్‌ని పట్టించిన హూడీ

Stray Dog: గద్వాలలో పిచ్చికుక్క వీరవిహారం.. ఒకేరోజు 15 మంది పై దాడి..!

సీఐ నాగ‌రాజు! దృశ్యం సినిమాను మ‌రిపించిన అదృశ్యం కేసు! ఏపీ స‌ర్కార్‌ను బ‌ద్నాం చేసిన ఖాకీ..!

Big Stories

×