E-Paper
Advertisement

ఎండల దెబ్బకు స్కూళ్లకు సెలవులు.. ఎడారిగా మాడిపోతున్న ఫ్రాన్స్, బ్రిటన్.. అసలేం జరుగుతోంది?

ఎండల దెబ్బకు స్కూళ్లకు సెలవులు.. ఎడారిగా మాడిపోతున్న ఫ్రాన్స్, బ్రిటన్.. అసలేం జరుగుతోంది?
Advertisement

Europe Heatwave: యూరోప్‌ కంట్రీస్‌ అంటే కూల్‌ వెదర్‌కు కేరాఫ్‌ అడ్రస్‌. అయితే ప్రస్తుతం అక్కడ సిట్చ్యూవేషన్‌ రివర్స్‌ అయింది. బాబోయ్‌.. ఎండలంటూ ఆమడదూరం పరిగెడుతున్నారు అక్కడి జనాలు. ఇప్పటివరకు కూల్‌గా ఉన్న వెదర్‌ ఒక్కసారిగా మారిపోవడంతో జనం బెంబెలెత్తుతున్నారు. యూరోప్‌లో సగటు ఉష్ణోగ్రత కంటే టెంపరేచర్‌ భారీగా పెరగడంతో ప్రజలు తిప్పలు తప్పడం లేదు. దీనికి తోడు ఎడారి ప్రాంతం నుంచి వచ్చే హీట్‌వేవ్‌ కూడా తోడవ్వడంతో ప్రజలు మాడిపోతున్నారు.

ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ..

భానుడి భగభగల నుంచి తప్పించుకునేందుకు నీటి కాలువలు, నదుల్లోకి దిగుతున్నారు అక్కడి ప్రజలు. ఇలా అజాగ్రత్తగా కాలువల్లోకి దిగి ఇప్పటివరకు 40మందికి పైగా మృతి చెందారు. ఫ్రాన్స్‌లోని అనేక ప్రాంతాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. 31 ప్రాంతాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఫ్రాన్స్‌లో హీట్‌వేవ్‌ దెబ్బకు స్కూల్స్‌కు హాలీడే ఇచ్చారు. సహారా ఎడారి నుంచి ఉత్తరం వైపు వేడిగాలులు రావడంతో ఫ్రాన్స్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక నెదర్లాండ్‌లో కూడా పలు ప్రాంతాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. మరికొన్ని రోజులు యూరోప్‌లో ఇదే పరిస్థితి కొనసాగే చాన్స్‌ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Advertisement

Also read: Water Wastage: ఇదో విచిత్రమైన ఘోరం.. ట్యాంక్ నిండా నీరు ఉన్నా.. ఊరికి మాత్రం కరువు..!

పలు దేశాలు హెచ్చరికలు

ఫ్రాన్స్‌ మాత్రమే కాదు.. స్పెయిన్‌, ఇటలీ దేశాల్లో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. ఫ్రాన్స్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పశ్చిమ బ్రిటన్‌లోని పలు ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అటవీ ప్రాంతాల్లో కార్చిర్చు మొదలవుతుందనే భయం ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే మైనే-ఎట్‌-లోయర్‌ ప్రాంతంలో చెలరేగిన కార్చిర్చును ఫైర్‌ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ప్రజలంతా అత్యవసరం ఉంటే తప్పా బయటకు రావద్దని ఇప్పటికే పలు దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి.

వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం..

Advertisement

యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్‌, స్విట్జర్లాండ్, జర్మనీలో రెడ్ అలర్ట్‌లు కొనసాగుతున్నాయి. తీవ్ర వేడిగాలులు, ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని ఈయూ దేశాలు ప్రకటించాయి. ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం యూరోప్ దేశాల్లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత కంటే రెండింతల వేడి నమోదవుతోంది. రాబోయే రోజుల్లో యూరోప్‌ దేశాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది. 1947 తర్వాత ఫ్రాన్స్‌లో అత్యంత వేడిగాలులు ఇప్పుడే వీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత భయానకంగా మారే పరిస్థితి అయితే కనిపిస్తోంది.

Also Read: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Related News

మోడీ పొర‌పాటు.. ఆర్ఎస్ఎస్ దిద్దుబాటు! జెన్‌జీని మ‌చ్చిక చేసుకునే ప‌నిలో బీజేపీ.. పీచేముడ్‌!

నిను వీడ‌ని బొద్దింక‌లు మేమే! చీఫ్ జ‌స్టిస్ చీఫ్ గెస్ట్‌గా మాకొద్దు.. న‌ల్సార్ వ‌ర్సిటీ విద్యార్థుల లేఖ దుమారం!

నాగార్జునసాగర్‌లో వరుణ యాగానికి సర్వం సిద్దం..!

బ్యాంక్‌లో లోన్ తీసుకున్నవారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. కొత్త రూల్స్ అమలు!

తెలంగాణ బీజేపీకి నితిన్ నబీన్ వార్నింగ్.. అలా చేస్తే మీ పోస్టు ఉస్టే..!

కాంగ్రెస్‌లో ఆపరేషన్ క్లీన్ ఇమేజ్.. టీపీసీసీ అంతర్గత విచారణలో షాకింగ్ నిజాలు!

ఇంటర్ విద్యలో మైండ్ బ్లాక్ అయ్యే స్కామ్.. కలర్ జిరాక్స్‌తో గెజిటెడ్ ఉద్యోగ పోస్టులు!

విజయ డెయిరీ వివాదంలో బిగ్ ట్విస్ట్.. చలసాని రాజీనామా వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

Big Stories

Advertisement
×