E-Paper
Advertisement

Delhi Andhra Meals: ఆహా ఏమి రుచి.. ఆంధ్రా భోజనానికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా, సీఎం చంద్రబాబు స్పందన

Delhi Andhra Meals: ఆహా ఏమి రుచి.. ఆంధ్రా భోజనానికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా, సీఎం చంద్రబాబు  స్పందన

Delhi Andhra Meals: తెలుగు వంటకాల రుచికి ఫిదా అయిపోయారు జపాన్ దౌత్యవేత్తలు. ఆంధ్ర రుచులను ఆస్వాదిస్తూ వారు చేసిన విందు భోజనం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఘాటైన మసాలాలు, నోరూరించే ఆవకాయ-పప్పు వాటితో ఆంధ్రా థాలీ చూసి ఆశ్చర్యపోయారు. వాటి రుచులను అమితంగా ఇష్టపడ్డారు. వాటికి సంబంధించి ఫోటోలను ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు.

ఆంధ్రా భోజనానికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా

ఆంధ్రా వంటకాల వాసన చూస్తే చాలు ఎప్పుడెప్పుడు భోజనం చేద్దామా అనిపిస్తుంది. పొరుగు ప్రాంతాలకు వెళ్లినప్పుడు కేవలం ఆంధ్రా భోజనం హోటల్‌కి మాత్రమే వెళ్తుంటారు తెలుగు ప్రజలు. ఆ వంటకాలు రుచికి జపాన్ దౌత్యవేత్తలు ఫిదా అయిపోయారు. మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌కి జపాన్ ఎంబసీ సభ్యులు వెళ్లారు.

నోరూరించే ఆంధ్ర రుచులను ఆస్వాదిస్తూ వారు చేసిన భోజనం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఘాటైన మసాలాలు, నోరూరించే పులిహోర, ఆవకాయ, పప్పు, పకోడి, గోంగూర పచ్చడి, గుత్తి వంకాయ కూర, సాంబార్‌లతో నిండిన థాలీ‌ని చూసి ఆశ్చర్యపోయారు. ఆయా రుచులను అమితంగా ఇష్టపడ్డారు కూడా.

జపాన్ దౌత్య సిబ్బంది కామెంట్స్ సీఎం చంద్రబాబు రియాక్ట్

వాటికి సంబంధించిన ఫోటోలు తీసి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు జపాన్ ఎంబసీ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మా టీమ్ లంచ్ చేశామని, రుచికరమైన ఆంధ్రా థాలీని ఆస్వాదించామని రాసుకొచ్చారు. ఘాటైన రుచులు, మసాలాలతో నిండి ఉందని రాసుకొచ్చారు. జపాన్ ఎంబసీ సభ్యుల పోస్టుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎంబసీ సభ్యులను ఏపీకి సాదరంగా ఆహ్వానించారు.

జపాన్ ఎంబసీ సభ్యులు చేసిన పోస్ట్‌పై సీఎం చంద్రబాబు స్పందించారు. దీనిపై హర్షం వ్యక్తం చేశారు.నిజంగా హృదయానికి హత్తుకునే విషయమని రాసుకొచ్చారు. ఏపీ భవన్‌లో మా సాంప్రదాయ ఆహారాన్ని ఆస్వాదించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ALSO READ:  వైసీపీకి కోలుకోని దెబ్బ.. సైకిల్ ఎక్కేసిన ఆ గ్రామస్తులు

జపాన్ వంటకాలు సుషీ, సాషిమి ఎలాగైతే కచ్చితత్వం మరియు సమతుల్యత ప్రతిబింబించినట్టుగానే ఆంధ్రా వంటకాలు కూడా తమ రుచుల ద్వారా ప్రతిబింబిస్తాయి. మీ కోసం, జపాన్ నుంచి మా రాష్ట్రానికి వచ్చే అతిధుల కోసం ఇంకా చాలా రుచులు ఉన్నాయన్నారు. మీ అందరికీ రెండో ఇల్లు ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతించడానికి తాము ఎదురుచూస్తున్నామని రాసుకొచ్చారు.

 

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×