E-Paper
Advertisement

Andhra Pradesh : నెక్ట్స్ టార్గెట్ ఏపీ.. 10 గ్యారంటీలతో ప్రజల్లోకి కాంగ్రెస్..

Andhra Pradesh : నెక్ట్స్ టార్గెట్ ఏపీ.. 10 గ్యారంటీలతో ప్రజల్లోకి కాంగ్రెస్..
Advertisement

Andhra Pradesh : ఏపీలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. కర్ణాటక, తెలంగాణల్లో విక్టరీతో ఫుల్ జోష్‌లో ఉన్న హస్తం పార్టీ.. ఆ దిశగా ప్రణాళికలకు సిద్ధం చేస్తోంది. ఢిల్లీలో ఏఐసీసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నాళ్లనుంచో రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న ప్రత్యేక హోదానే ప్రధాన ఎజెండాగా ఎన్నికలకు వెళ్లనుంది కాంగ్రెస్‌.

ఈ ఎన్నికల హామీలపైనా కాంగ్రెస్ దృష్టిపెట్టింది. ఏపీకి 10 గ్యారంటీలు ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు ఎన్నికల ప్రచారంపైనా ఫోకస్ పెట్టింది. 3 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ సభల్లో రాహుల్‌ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలు రావాలని ఏపీ నేతలు కోరినట్టు తెలుస్తోంది. ఇలా ప్రచారం వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది.

Advertisement

సీఎం జగన్‌ను టార్గెట్‌ గా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. అధికార వైసీపీ పార్టీపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది. జగన్ సర్కార్ ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అంటున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తోంది. బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారం చేపట్టిన 10 గ్యారంటీలను ప్రకటించి ప్రజలను ఆకట్టుకోవాలని వ్యూహరచన చేస్తోంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టి.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను సాధించాలని యోచిస్తోంది.

Advertisement

.

.

Related News

బ్యాంకర్లపై సీఎం చంద్రబాబు ఫైర్.. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో క్లాస్!

విజయనగరం జిల్లాలో విషాధం.. భర్త అంత్యక్రియలకు డబ్బుల్లేక భార్య కన్నీటిరోదన!

క్రెడిట్ కొట్టేస్తున్న చంద్రబాబు.. ఎస్వీ మ్యూజియం అసలు నిజాలివే! – భూమన కరుణాకర్ రెడ్డి

నడిరోడ్డుపై కుప్పగా నోట్ల కట్టలు.. అసలు ఏం జరిగింది? విశాఖ సిటీలో ఘటన

వెటర్నరీ శాఖలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోవడంపై వైసీపీ విమర్శలు, రంగంలోకి దిగిన మంత్రి

జనసేన క్లారిటీ.. జగన్‌ను బెంగళూరులో బాలినేని భేటీ వ్యవహారం, దీని వెనుక

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×