![](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/12/a8467f05898b58b466f3eb83752a7271.jpg)
Contributory Pension Scheme | ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్నం చేస్తూ తన చావుకు ముఖ్యమంత్రి జగన్ కారణమంటూ ఓ లేఖ రాశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పెన్నఅహోబిలంలో జరిగింది.
ఉరవకొండ మండలం చిన్న ముస్తూరు ప్రాంతానికి చెందిన మల్లేశ్ అనే ఉపాధ్యాయుడు సీపీఎస్ (Contributory Pension Scheme)రద్దు చేయలేదని ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యాయత్నం చేసుకునే ముందు అయిదు పేజీల లేఖ రాసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులను మోసం చేశారంటూ మల్లేశ్ తన సూసైడ్ నోట్లో రాశాడు. సిపిఎస్ రద్దు, 5వ తేదీకల్లా జీతాలు ప్రభుత్వం అమలు చేయడమే తన చివరి కోరిక అని లేఖలో ఆయన ప్రస్తావించారు.
పెన్నఅహోబిలం ఆలయం వద్ద విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. స్థానికులు గమనించి మల్లేశ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.