BigTV English
Advertisement

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు ఈసీ నోటీసులు.. 48 గంటల్లో వివరణ ఇవ్వాలి..!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు ఈసీ నోటీసులు.. 48 గంటల్లో వివరణ ఇవ్వాలి..!
Ec Notices To Pawan Kalyan
Ec Notices To Pawan Kalyan

EC Notices To Pawan Kalyan: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అనకాపల్లిలో నిర్విహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ పై చేసిన విమర్శలకు గాను ఈసీ నోటీసులు జారీ చేసింది.


సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే అనకాపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జగన్ పై చేసిన వ్యాఖ్యలను గానూ వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ జగన్ ఓ స్కాం స్టార్, లాండ్ గ్రాబర్, సాండ్ అండ్ లిక్కర్ ఎంపరర్ అంటూ విమర్శలు గుప్పించారు.

దీంతో ఏప్రిల్ 8వ తేదీన ఎలక్షన్ కమిషన్ కు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధంగా పవన్ కళ్యాణ్ జగన్ పై వ్యాఖ్యలు చేశారంటూ విష్ణు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్ పై చేసిన వ్యాఖ్యలకు గాను పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీని కోరారు.


Also Read: నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకున్న ఆడపిల్లలు: పవన్ కళ్యాణ్

వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన 48 గంటల్లో జగన్ పై చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పవన్ కు ఈసీ నోటీసులు జారీ చేయడంపై రాజకీయంగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

Related News

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Big Stories

×