E-Paper
Advertisement

వైసీపీ మూడు రాజధానుల వ్యవహారం.. గుట్టు విప్పిన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్, తన పుట్టుకను కూడా

వైసీపీ మూడు రాజధానుల వ్యవహారం.. గుట్టు విప్పిన మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్, తన పుట్టుకను కూడా

Amaravati: వైసీపీ హయాంలో మూడు  రాజధానుల బిల్లు సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎట్టకేలకు నోరు విప్పారు మాజీ ఛైర్మన్ షరీఫ్. మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నందుకు ఆనాడు ఓ మంత్రి తనపై చేయి చేసుకున్నారని మనసులోని మాట బయటపెట్టారు.  ఇప్పుడు ఆ సందర్భం రావడంతో కీలక విషయాలను ఆయన బయట పెట్టారు.

వైసీపీ మూడు రాజధానుల వ్యవహారం

తప్పు జరిగిన వెంటనే నిజం తెలియకపోయినా తర్వాత మెల్లగా తెలుస్తోంది. ఇది వైసీపీకి అతికినట్టు సరిపోతుంది. ఎందుకుంటే వైసీపీ రూలింగ్‌లో మూడు రాజధానుల గురించి జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. అనుకూల మీడియా తాటికాయంత అక్షరాలతో ఉదయం మొదలు రాత్రి వరకు పుంఖాను పుంఖానుగా వార్తలు ప్రచారం చేసింది. అసెంబ్లీలో మూడు రాజధానులపై బిల్లు పాస్ అయ్యింది.

మండలిలో టీడీపీకి బలం ఉండడంతో నెగ్గించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది వైసీపీ సర్కార్. ఆ బిల్లు సమయంలో మండలి ఛైర్మన్‌గా షరీఫ్ కొనసాగుతున్నారు. మండలిలో మూడు రాజధానుల బిల్లు విషయంలో పెద్ద రచ్చ జరిగింది. ఆనాడు ఛైర్మన్ నోరు మెదపలేదు. సమయం, సందర్భం వచ్చినప్పుడు బయటపెట్టాలని భావించారు. ఇప్పుడు ఆ విషయాన్ని వెల్లడించారు.

ఆనాటి మండలి గుట్టు బయటపెట్టిన మాజీ ఛైర్మన్ షరీఫ్

ఏపీ రాజధాని అమరావతిగా పేర్కొంటూ పార్లమెంటు ఉభయసభల్లో గురువారం బిల్లు పాసైంది. ఈ సందర్భంగా గురువారం టీడీపీ ఆఫీసులో జరిగిన అమరావతి వేడుకల్లో మాజీ ఛైర్మన్ షరీఫ్ పాల్గొన్నారు. ఆనాడు గత చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ వేదికపై ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

ఆనాడు మూడు రాజధానుల బిల్లుపై మండలిలో జరిగిన వ్యవహారాన్ని బయటపెట్టారు. సభా గౌరవాన్ని కాపాడేందుకు ఆనాడు నోరు విప్పలేదన్నారు. తమ మాట వినకుంటే మండలిని రద్దు చేస్తామని ఆనాటి పాలకులు ప్రకటన చేశారని అన్నారు. తనను పదవి నుంచి తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీ కావని గుర్తు చేశారు.

ALSO READ: మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో పేర్ని నానిని అడ్డుకున్న సిబ్బంది.. ఆసుపత్రిలో కూడా రాజకీయాలా అంటూ ఆగ్ర‌హం

మండలిలో టేబుల్‌పైకి వైసీపీ సభ్యులు ఎక్కి రచ్చ చేశారని తెలిపారు. ఒకానొక సమయంలో బిల్లును అడ్డుకున్నందుకు ఓ మంత్రి తనపై చేయి చేసుకున్నారని మనసులోని ఆవేదనను బయటపెట్టారు. చివరకు కులం పేరుతో దూషించి, పుట్టుకను నిందించారని కాసింత భావోద్వేగానికి గురయ్యారు.

 

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×