Amaravati: వైసీపీ హయాంలో మూడు రాజధానుల బిల్లు సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎట్టకేలకు నోరు విప్పారు మాజీ ఛైర్మన్ షరీఫ్. మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నందుకు ఆనాడు ఓ మంత్రి తనపై చేయి చేసుకున్నారని మనసులోని మాట బయటపెట్టారు. ఇప్పుడు ఆ సందర్భం రావడంతో కీలక విషయాలను ఆయన బయట పెట్టారు.
వైసీపీ మూడు రాజధానుల వ్యవహారం
తప్పు జరిగిన వెంటనే నిజం తెలియకపోయినా తర్వాత మెల్లగా తెలుస్తోంది. ఇది వైసీపీకి అతికినట్టు సరిపోతుంది. ఎందుకుంటే వైసీపీ రూలింగ్లో మూడు రాజధానుల గురించి జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. అనుకూల మీడియా తాటికాయంత అక్షరాలతో ఉదయం మొదలు రాత్రి వరకు పుంఖాను పుంఖానుగా వార్తలు ప్రచారం చేసింది. అసెంబ్లీలో మూడు రాజధానులపై బిల్లు పాస్ అయ్యింది.
మండలిలో టీడీపీకి బలం ఉండడంతో నెగ్గించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది వైసీపీ సర్కార్. ఆ బిల్లు సమయంలో మండలి ఛైర్మన్గా షరీఫ్ కొనసాగుతున్నారు. మండలిలో మూడు రాజధానుల బిల్లు విషయంలో పెద్ద రచ్చ జరిగింది. ఆనాడు ఛైర్మన్ నోరు మెదపలేదు. సమయం, సందర్భం వచ్చినప్పుడు బయటపెట్టాలని భావించారు. ఇప్పుడు ఆ విషయాన్ని వెల్లడించారు.
ఆనాటి మండలి గుట్టు బయటపెట్టిన మాజీ ఛైర్మన్ షరీఫ్
ఏపీ రాజధాని అమరావతిగా పేర్కొంటూ పార్లమెంటు ఉభయసభల్లో గురువారం బిల్లు పాసైంది. ఈ సందర్భంగా గురువారం టీడీపీ ఆఫీసులో జరిగిన అమరావతి వేడుకల్లో మాజీ ఛైర్మన్ షరీఫ్ పాల్గొన్నారు. ఆనాడు గత చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ వేదికపై ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
ఆనాడు మూడు రాజధానుల బిల్లుపై మండలిలో జరిగిన వ్యవహారాన్ని బయటపెట్టారు. సభా గౌరవాన్ని కాపాడేందుకు ఆనాడు నోరు విప్పలేదన్నారు. తమ మాట వినకుంటే మండలిని రద్దు చేస్తామని ఆనాటి పాలకులు ప్రకటన చేశారని అన్నారు. తనను పదవి నుంచి తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీ కావని గుర్తు చేశారు.
మండలిలో టేబుల్పైకి వైసీపీ సభ్యులు ఎక్కి రచ్చ చేశారని తెలిపారు. ఒకానొక సమయంలో బిల్లును అడ్డుకున్నందుకు ఓ మంత్రి తనపై చేయి చేసుకున్నారని మనసులోని ఆవేదనను బయటపెట్టారు. చివరకు కులం పేరుతో దూషించి, పుట్టుకను నిందించారని కాసింత భావోద్వేగానికి గురయ్యారు.
కులం పేరుతో దూషించి, పుట్టుకను నిందించారు: మాజీ మండలి ఛైర్మన్
ఏపీ శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ హయాంలో 3 రాజధానుల బిల్లు సమయంలో..
చోటు చేసుకున్న పరిణామాలపై నోరువిప్పిన షరీఫ్మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నందుకు..
నాడు ఓ మంత్రి నాపై చేయి చేసుకున్నారు:… pic.twitter.com/9Zm9MlfIGw— BIG TV Breaking News (@bigtvtelugu) April 3, 2026