E-Paper
Advertisement

Sidda Raghava Rao : వైసీపీకి షాక్.. మాజీమంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా

Sidda Raghava Rao : వైసీపీకి షాక్.. మాజీమంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా
Advertisement

Sidda Raghava Rao Resigned to Ysrcp : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్సీపీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శిద్దా రాఘవరావు తన లేఖలో వెల్లడించారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ- బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు శిద్ధా రాఘవరావు. జనసేన మద్దతు కూడా ఉండటంతో.. అప్పట్లో కాపు సామాజికవర్గం ఓట్లు అధికంగా పడ్డాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో శిద్దా రాఘవరావును టీడీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన శిద్దా రాఘవరావు టీడీపీని వీడి.. వైసీపీ కండువా కప్పుకున్నారు.

Advertisement

ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి దర్శి టికెట్ ఆశించగా.. అధిష్టానం మొండిచేయి చూపించింది. దర్శి టికెట్ ను మరొకరికి కేటాయించడంతో.. పార్టీ వీడేందుకు ఆయన సిద్ధమయ్యారన్న వార్తలొచ్చాయి. కానీ ఇంతలో ఆయనకు జగన్ నుంచి పిలుపు రావడంతో.. పార్టీ ఫిరాయింపుకు బ్రేక్ పడింది. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేయడంతో.. టీడీపీలో చేరతారన్న వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×