E-Paper
Advertisement

AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల

AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల
Advertisement

AP Fee Reimbursement: పండుగ వేళ ఏపీ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.394.29 కోట్లు విడుదల చేసింది. గత ప్రభుత్వంలో కాలేజీలకు రూ.4,000 కోట్లు బకాయి పెట్టగా కూటమి ప్రభుత్వం విడతల వారీగా వాటిని చెల్లిస్తుందని కూటమి నేతలు తెలిపారు. ఇప్పటివరకు రూ.1,600 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం.

ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్ బకాయిల్లో రూ. 394.29 కోట్లు చెల్లించేందుకు ఆరు ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి దాదాపు మూడు త్రైమాసికాల ఫీజు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. వీటిని ప్రభుత్వం కాలేజీలకు చెల్లించాల్సి ఉంది. గతంలో మొదటి విడత పూర్తిగా చెల్లించగా, రెండో విడతలో కొంత మేర విడుదల చేసింది. తాజాగా మిగతా బకాయిల మొత్తం విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

నేరుగా కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో

Advertisement

ఏపీ ప్రభుత్వం బకాయిల విడుదలకు సంబంధించి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనల్ ఇయర్ చదువుతున్న, పూర్తి చేసిన విద్యార్థులకు సంబంధించిన రూ.394.29 కోట్లను విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను నేరుగా కాలేజీల అకౌంట్లలో జమ చేస్తారు.

2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి, ఫీజులు విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ కావాల్సి ఉంది. అయితే కొన్ని కాలేజీలు మాత్రం విద్యార్థులు ఫీజులు కట్టలేదని అంటున్నాయి. ఫీజులు కట్టకపోయినా సర్టిఫికెట్లు ఇచ్చామని చెప్పాయి. దీనిపై ప్రభుత్వం సర్వే చేయగా.. చాలా కాలేజీలు విద్యార్థుల నుంచి ముందుగానే ఫీజులు వసూలు చేశాయని తేలింది. దీంతో 2023-24 విద్యా సంవత్సరం ఫీజులను తల్లుల ఖాతాల్లోనే జమచేసే అవకాశం ఉందని సమాచారం.

ఫీజు రీయింబర్స్మెంట్

Advertisement

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో మార్పులు చేసింది. వైసీపీ హయాంలో ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేది. విద్యార్థుల తల్లులు కాలేజీలకు ఆ ఫీజులు చెల్లించేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను కాలేజీ యాజమాన్యాల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది.

Also Read: Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్

నిర్ణీత గడువులోగా విద్యార్థుల తల్లులు ఫీజులు చెల్లించకపోతే విద్యార్థులు ఇబ్బంది పడతారని గ్రహించి, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను డైరెక్టుగా కాలేజీ యాజమాన్యాల అకౌంట్లలోనే జమ చేసేలా మార్పు చేసింది.

Related News

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Big Stories

Advertisement
×