E-Paper
Advertisement

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!
Advertisement

Bus Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కకు బోల్తా పడటంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. కొండపి నియోజకవర్గం నుంచి మద్దులూరు మీదుగా ఒంగోలు వైపు ప్రయాణికులను తీసుకెళ్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. బస్సు అదుపుతప్పి పడిపోవడంతో ప్రయాణికులంతా ప్రాణ భయంతో అరుపులు, కేకలు వేశారు. అయితే అదృష్టవశాత్తూ ఒక పెద్ద ముప్పు మాత్రం తప్పిందనే చెప్పాలి.

ఎదురెదురుగా వచ్చిన బస్సులు.. క్షణాల వ్యవధిలో!
లభించిన సమాచారం ప్రకారం.. కొండపి-మద్దులూరు ప్రధాన మార్గంలోని ద్వారకా సీఫుడ్స్ పరిశ్రమ సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు వేగంగా వెళ్తుండగా, అదే సమయంలో మలుపు వద్ద ఎదురుగా మరో బస్సు అకస్మాత్తుగా ముందుకు వచ్చింది. ఆ బస్సును ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో పల్లెవెలుగు డ్రైవర్ సమయస్ఫూర్తితో స్టీరింగ్‌ను పక్కకు తిప్పారు. ఈ క్రమంలోనే నియంత్రణ కోల్పోయిన బస్సు రోడ్డు పక్కనున్న లోతట్టు ప్రాంతంలోకి దూసుకెళ్లి ఒక్కసారిగా బోల్తా పడింది. అయితే ప్రమాద సమయానికి బస్సులో సుమారు 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో దాదాపు 20 మంది పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులే కావడం గమనార్హం.

Advertisement

ముళ్ల పొదలే ప్రాణాలు కాపాడాయా?
ఈ ప్రమాదానికి రోడ్డు నిర్వహణ లోపమే ప్రధాన కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మలుపు వద్ద రోడ్డుకు ఇరువైపులా ముళ్ల చెట్లు, పొదలు దట్టంగా పెరిగిపోవడంతో.. ఎదురుగా వస్తున్న వాహనాలు అస్సలు కనిపించడం లేదని వారు చెబుతున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఆ ముళ్ల చెట్లే ప్రయాణికుల పాలిట రక్షణగా నిలిచాయి. బస్సు బోల్తా పడిన సమయంలో దట్టమైన ముళ్ల పొదలు అడ్డుగా ఉండటంతో బస్సు వేగం తగ్గి, మరింత లోతుకు పడిపోకుండా ఆగిపోయింది. దీనివల్ల చాలామందికి పెద్దగా గాయాలు కాలేదు.

క్షతగాత్రులకు కొండపి ఆసుపత్రిలో చికిత్స
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, వాహనదారులు బస్సు అద్దాలు పగులగొట్టి లోపల చిక్కుకున్న ప్రయాణికులను, విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో కొందరికి స్వల్పంగా, మరికొందరికి మోస్తరు గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ వెంటనే 108 వాహనాల్లో కొండపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికులందరూ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అటు అధికారులు, ఇటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

Related News

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

విజయవాడకు రిలీఫ్.. ఇక రాయనపాడు రైల్వేస్టేషన్ వంతు, జర్నీ మరింత వేగవంతం

అప్పుడు ఓ అడుగు వెనక్కి తగ్గాం.. ఇప్పుడు తగ్గేదిలేదు-మంత్రి నాదెండ్ల

శవానికి తాళి కట్టు.. ప్రియుడిపై చనిపోయిన యువతి బంధువులు ఒత్తిడి, అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×