Fishermen Death: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలోని పోలవరంకు పక్కన గొల్లగూడెం పరిధిలో ఓ దారున సంఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను కలకలం రేపింది. జీవనోపాధి కోసం చేపల వేటకు వెళ్లి ఓ ఐదుగురు మత్స్యకారులు గోదావరి నదిలో కొట్టుకు పోయి మరణించారు. దీంతో ఈ విషాద గటన అందరిని కలిచివేసింది. రోజులాగే చేపల వేటకు వెల్లిన వారు తిరిగి రాకుండా మరణిచడంతో తీవ్ర విషాదం నెలకొంది.
పోలవరం జిల్లా గొల్లగూడెం వద్ద జరిగిన దారుణ సంఘటనపై సీఎం స్పందించారు. గోదావరి నదిలో వేటకెళ్లి ఐదుగురు మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు.
Also read: UPI పేమెంట్స్పై కొత్త రూల్.. రూ.2,000 దాటితే ఛార్జీలు వసూలు చేసే అవకాశం?
గొమ్ముకొత్తగూడెంకు చెందిన తుర్రం భారతి, ఊకే సుశీల, ఊకే లక్ష్మి, బాసిబోయిన బాలరాజు, ఊకే రమేష్ అనే ఐదుగురు వేటకు వెళ్లి మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో సంఘటన పై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Also read: ఉప్పల్లో దారుణం.. తల్లిని ఇంట్లో బంధించి, నగ్నంగా రోడ్డుపైకి.. ఆపై చెరువులో శవమై.. అసలేం జరిగింది?