BigTV English
Advertisement

Jagan : షర్మిలకు జగన్ రాయబారం.. కడప ఎంపీ సీటు ఆఫర్..!

Jagan : షర్మిలకు జగన్ రాయబారం.. కడప ఎంపీ సీటు ఆఫర్..!

Jagan : మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్న వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీలో అడుగుపెడతారనే వార్త వైసీపీలో అలజడి రేపుతోంది. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల వెంట నడుస్తానని ప్రకటించి అధికార పార్టీలో గుబులు పుట్టించారు. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న చాలామంది నేతలు షర్మిల వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారని టాక్ నడుస్తోంది. టిక్కెట్ దక్కదని తేలితే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఇలాంటి నాయకులందరూ వైసీపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.


షర్మిల కాంగ్రెస్ వైపు అడుగులు వేయడంతో వైసీపీ అధిష్టానం అలెర్ట్ అయ్యింది. ఆమె కాంగ్రెస్‌లో చేరకుండా జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. చెల్లెలికి వైవీ సుబ్బారెడ్డితో రాయబారం పంపారు. ఆదివారం షర్మిలతో భేటీ అయిన వైవీ సుబ్బారెడ్డి.. కాంగ్రెస్‌లో చేరొద్దని సూచించారు. జగనే ఈ విషయం చెప్పారని ఆమెతో అన్నారని తెలుస్తోంది. షర్మిలకు కడప ఎంపీ టికెట్ ఇస్తామని జగన్ ఆఫర్ ఇచ్చారని సమాచారం. అయితే ఇన్నాళ్లకు గుర్తొచ్చానా? అని షర్మిల వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. అంతేకాదు జగన్ ప్రతిపాదనను షర్మిల తిరస్కరించినట్లు తెలుస్తోంది.

తాజాగా పరిణామాలతో షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయమని తేలిపోయింది. వైసీపీలో ఎమ్మెల్యే టిక్కెట్ దక్కని నేతలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం వైసీపీపై బాగా పడుతుందని అంటున్నారు. మరి చెల్లి కాంగ్రెస్ చేరడం ఇంకా ప్రయత్నాలు జగన్ చేస్తారా? ఒకవేళ ఆమె ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడితే జగన్ వ్యూహమేంటి? ఇదే విషయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.


.

.

Related News

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Big Stories

×