BigTV English

Janasena MLA Candidates: రైల్వేకోడూరు జనసేన అభ్యర్థి మార్పు.. మండలికే అవనిగడ్డ టిక్కెట్..!

Janasena MLA Candidates: రైల్వేకోడూరు జనసేన అభ్యర్థి మార్పు.. మండలికే అవనిగడ్డ టిక్కెట్..!
Pawan Kalyan
Pawan Kalyan

Janasena MLA Candidates: జనసేన పార్టీ రైల్వేకోడూరు ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చింది. తొలుత రైల్వేకోడూరు అసెంబ్లీ అభ్యర్థిగా యనమల భాస్కరరావు పేరును పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ తర్వాత అభ్యర్థిని మారుస్తారంటూ ప్రచారం సాగింది. అరవ శ్రీధర్ అభ్యర్థిగా ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. ప్రచారం సాగిన విధంగానే జనసేనాని అభ్యర్థిని మార్చేశారు. యనమల భాస్కరరావుకు పవన్ కల్యాణ్ షాక్ ఇచ్చారు. అరవ శ్రీధర్ ను అభ్యర్థిగా ప్రకటించారు.


గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా రైల్వేకోడూరు ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చారని తెలుస్తోంది. యనమల భాస్కరరావుపై టీడీపీలో వ్యతిరేకత వ్యక్తమైందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అరవ శ్రీధర్ ను అభ్యర్థిగా ప్రకటించారు.

అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇటీవల టీడీపీ నుంచి జనసేనలో చేరిన మండలి బుద్ధ ప్రసాద్ పేరును ఖరారు చేశారు. మరొక స్థానంలో మాత్రమే జనసేన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. పాలకొండ అభ్యర్థిని ఆ పార్టీ ఇంకా ప్రకటించలేదు. రెండురోజుల్లో పాలకొండ అభ్యర్థిని ప్రకటిస్తారని తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికపై జనసేనాని పవన్ కల్యాణ్ కసరత్తు చేస్తున్నారు. స్థానిక నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు.


Also Read: గ్లాస్ పగిలింది.. జనసేనకు ఈసీ బిగ్ షాక్!

ఏపీలో ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే 20 మంది అభ్యర్థులను పవన్ కల్యాణ్ ప్రకటించారు. మరో రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తోంది. కాకినాడ లోక్ సభ స్థానం తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి వల్లభనేని బాలశౌరి పేర్లను పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు.

Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×