E-Paper
Advertisement

ippatam: గెలిచేది లేదు, సినిమాలు చేసుకో.. పవన్ కు కొడాలి పంచ్ లు..

ippatam: గెలిచేది లేదు, సినిమాలు చేసుకో.. పవన్ కు కొడాలి పంచ్ లు..
Advertisement

ippatam: ఛాన్స్ చిక్కితే చాలు పవన్ కల్యాణ్, చంద్రబాబులపై మాటలతో విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు. పవన్ వర్సెస్ వైసీపీ వివాదం.. చెప్పులు చూపించుకోవడం వరకూ దారి తీసింది. ఆ రచ్చ ఇంకా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. లేటెస్ట్ గా, జనసేనానిపై ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు కొడాలి నాని. ఇప్పటం కేసు విషయంలో సెటైరికల్ ట్వీట్ చేశారు.

“నీ గురువు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు.. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచేది లేదు. ప్రశాంతంగా సినిమాలు చేసుకోక మిడిమిడి జ్ఞానంతో రాజకీయాలు చేయడం ఎందుకు పవన్ కళ్యాణ్”.. అంటూ ట్వీట్ చేశారు నాని. ట్వీట్ లో.. “ఇప్పటం పిటిషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జరిమానా విధించిన హైకోర్టు” అని కూడా ప్రస్తావించారు.

Advertisement

ఇప్పటంలో నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లు కూల్చివేశారంటూ 14 మంది స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, నోటీసులు ఇచ్చాకే ఇళ్లు కూల్చివేశామంటూ అధికారులు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. కోర్టు సమయం వృధా చేశారంటూ పిటిషనర్లకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు ఫైన్ వేసింది. ఇదే విషయంపై పవన్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు కొడాలి నాని.

ఇటీవల ఇప్పటంలో రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్లు కూల్చివేయడంపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటం వెళ్లి మరీ కూల్చివేతలను పరిశీలించారు. వైసీపీ సర్కారు తీరుపై మండిపడ్డారు. ఒక్కో ఇంటికి లక్ష ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. ఈ నెల 27న పవన్ మరోసారి ఇప్పటం వెళ్లి బాధితులకు లక్ష రూపాయల చెక్కు ఇవ్వనున్నారు.

Advertisement

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×