E-Paper
Advertisement

Kotamreddy : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్.. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం..

Kotamreddy : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్.. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం..
Advertisement

Kotamreddy : నెల్లూరులో రాజకీయం మరోసారి వేడెక్కింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని ఆయన నిరసనకు పిలుపునిచ్చారు. అయితే ఈ ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయినాసరే కోటంరెడ్డి నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోటంరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారన్న సమాచారం తెలియగానే ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బహిష్కరణకు గురయ్యారు. అంతకుముందు కూడా పార్టీ అధిష్టానంపై , ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. తన నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు ఇవ్వడంలేదని నిలదీశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీతో కోటంరెడ్డికి దూరం పెరిగింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి కోటంరెడ్డి ఓటేశారని భావించిన వైసీపీ అధిష్టానం.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత తన వాయిస్ ను కోటంరెడ్డి మరింత పెంచారు. తరచూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరోసారి నిరసనకు దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం తీరుపై కోటంరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

Related News

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

Big Stories

Advertisement
×