E-Paper
Advertisement

Kollu Ravindra: దొంగ సారా అమ్మి దొరికిపోయి విమర్శలా?.. జోగి రమేశ్ కు మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

Kollu Ravindra: దొంగ సారా అమ్మి దొరికిపోయి విమర్శలా?.. జోగి రమేశ్ కు మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్
Advertisement

Kollu Ravindra: బందరు పోర్టును అమ్మేసిన వ్యక్తి ఒకరు, దొంగ సారా అమ్మి అడ్డంగా దొరికిపోయింది మరొకరు అంటూ వైసీపీ నేతలు పేర్ని నాని, జోగి రమేశ్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. రాజకీయ స్వలాభం కోసం గోడలు దూకే వ్యక్తి పేర్ని నాని అని విమర్శలు చేశారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి పేర్ని నాని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్ట్రీట్ ఫీల్డ్ పేరుతో దొంగ పట్టాలు ఇచ్చి రెవెన్యూ అధికారులను రోడ్డుపై నిలబెట్టింది పేర్ని నాని కాదా? అని మండిపడ్డారు. పేర్ని నానికి సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి లేదని ఎద్దేవా చేశారు.

కట్టుకున్న భార్యను రోడ్డున పడేశావ్

అవినీతి వ్యాపారంతో కట్టుకున్న భార్యనే రోడ్డున పడేసిన వ్యక్తి పేర్ని నాని అని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరు పోర్టు పేరుతో రాజకీయ డ్రామాలు ఆడిన వ్యక్తి పేర్ని నాని అని ఆరోపించారు. వైసీపీ చేసిన పాపాలన్నీ కౌంట్ అయి 151 నుంచి 11 సీట్లకు పడిపోయారన్నారు. రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్న సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత పేర్ని నానికి లేదన్నారు. 2024 ఎన్నికల్లో తనకు డిపాజిట్లు కూడా రావని తెలిసి పోటీ చేయకుండా పారిపోయిన వ్యక్తి పేర్ని నాని అన్నారు.

దమ్ముంటే రా.. తడాఖా చూపిస్తాం

Advertisement

ఇటీవల జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి జోగి రమేశ్.. సీఎం చంద్రబాబు, లోకేశ్ పై విమర్శలు చేశారు. ఈ విషయంపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేశ్ కు దమ్ముంటే సీఎం చంద్రబాబు ఇంటిపైకి రావాలన్నారు. ఇప్పుడేంటో తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. దొంగ సారా అమ్మి అడ్డంగా దొరిరిపోయిన వ్యక్తి జోగి రమేశ్‌లో ఇంక కూడా ప్రాయశ్చిత్తం లేదన్నారు.

Also Read: కేవలం 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 12 గంటలు నడిచే ఫోన్.. రియల్మీ కొత్త ఫోన్ గురూ

Advertisement

జైలు నుంచి బెయిల్‌పై విడుదలై.. ఇంటి వెళ్లేందుకు కార్ల పై ఎక్కి నానా హంగామా సృష్టించారన్నారు. కార్ల ర్యాలీకి అనుమతులు లేవని చెప్పినందుకు పోలీస్ అధికారికి వేలు పెట్టి బెదిరిస్తావా? అని జోగి రమేశ్ పై ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయినా, ఇంకా అరాచకాలకు పాల్పడుతున్నాడని జోగి రమేశ్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×