Minister Lokesh: ఏపీ సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. ప్రముఖ ఇంగ్లిష్ మీడియా సంస్థ ‘ఎకనమిక్ టైమ్స్’ ఈ అవార్డును ప్రకటించింది. తన తండ్రితో సహా కుటుంబ సభ్యులకు వచ్చిన అవార్డుల గురించి ప్రస్తావిస్తూ మంత్రి లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
‘మా నాన్న బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. అమ్మ భువనేశ్వరి ‘గోల్డెన్ పీకాక్’ అవార్డును ఇంటికి తీసుకువస్తున్నారు. భారతదేశంలోని ‘వ్యాపారంలో అత్యంత శక్తివంతమైన మహిళలలో’ నా సతీమణి బ్రాహ్మణి ఒకరు. నా కుటుంబంతో పోటీ పడటం ఎన్నికలకన్నా కష్టంగా ఉంది’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
తన కుటుంబంలో ప్రతీ ఒక్కరూ ఆయా రంగాల్లో విశేష ప్రతిభతో అవార్డులు పొందారని మంత్రి లోకేశ్ అన్నారు. వారితో పోటీ పడడం ఎన్నికల పోటీ కంటే కష్టంగా మారిందని అంటూ ఫన్నీ ట్వీట్ చేశారు. నిత్యం తన ఫ్యామిలీతో పోటీ పడుతున్నట్లు అన్నారు. అంతకు ముందు మరో ట్వీట్ లో సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకమైన అవార్డు వచ్చిందని ప్రకటించారు.
“మా కుటుంబానికి, ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణమైన క్షణం. సీఎం చంద్రబాబుకు ఎకనమిక్స్ టైమ్స్ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ప్రకటించింది. భారతదేశంలో సంస్కరణలను స్పష్టత, ధైర్యం, స్థిరత్వంగా కొంతమంది నాయకులు మాత్రమే కొనసాగించారు. పాలనలో సంస్కరణలు, వేగం చూపిన సీఎం చంద్రబాబు అచంచల దూరదృష్టికి ఈ అవార్డు నివాళి” అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.
Also Read: Chandrababu Naidu: డాక్టరేట్ తిరస్కరించా.. ‘రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుపై స్పందించిన చంద్రబాబు