E-Paper
Advertisement

Chandrababu Naidu: డాక్టరేట్ తిరస్కరించా.. ‘రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుపై స్పందించిన చంద్రబాబు

Chandrababu Naidu: డాక్టరేట్ తిరస్కరించా.. ‘రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుపై స్పందించిన చంద్రబాబు

Chandrababu Naidu: ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన ప్రతిష్టాత్మక ‘బిజినెస్‌ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపికవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినమ్రంగా స్పందించారు. సాధారణంగా తాను అవార్డులు స్వీకరించనని, గతంలో విదేశీ విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లు ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించానని గుర్తు చేశారు. అయితే, ఈ అవార్డు వెనుక తన సహచరులు, అధికారులు, కలెక్టర్ల కృషి ఎంతో ఉందని, అందుకే ఈ క్రెడిట్ అంతా వారికే దక్కుతుందని అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై మాట్లాడుతూ.. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EoDB)లో గుజరాత్ ప్రథమ స్థానంలో ఉండేదని, ఆ తర్వాత నిబంధనలు ఎన్నిసార్లు మారినా ఏపీనే అగ్రస్థానంలో నిలుపుతూ వచ్చామని తెలిపారు. ప్రస్తుతం గేర్ మార్చి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. గడిచిన 18 నెలల్లోనే 25 నూతన పాలసీలను తీసుకొచ్చి, ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీల ద్వారా వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో (Escrow) ఖాతా విధానాన్ని ప్రవేశపెట్టామని, త్వరలోనే దీనికి మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించగలరా అని చాలామంది అనుమానపడ్డారని, కానీ ప్రజలు, పరిశ్రమలు నేడు ఏపీని విశ్వసిస్తున్నాయని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రయాణంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును కూడా మరువలేనిదని కొనియాడారు. లేబర్ కోడ్ మార్గదర్శకాల విషయంలో కేంద్రం ఏపీని సంప్రదించడం మన పనితీరుకు నిదర్శనమని, ఇకపై ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఇది రాష్ట్రానికి గర్వకారణం: నారా లోకేశ్

 ముఖ్యమంత్రి చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు రావడం పట్ల మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ కుటుంబానికే కాకుండా, యావత్ ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. “అత్యంత స్పష్టత, ధైర్యం, నిలకడతో భారతదేశ సంస్కరణల ప్రయాణాన్ని తీర్చిదిద్దిన కొద్దిమంది నాయకులలో చంద్రబాబు ఒకరు. సంస్కరణలు, వేగం, పాలనలో విశ్వసనీయతపై ఆయనకున్న అచంచలమైన దీక్షకు ఈ అవార్డు నిదర్శనం” అని లోకేశ్ కొనియాడారు.

Read Also: YS Jagan : జగన్ పాలన ఎలా ఉండేదో అప్పుడే మరిచిపోయారా? ఆ భారం బాబు చేతుల్లో!

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×