BigTV English

Andhra Pradesh : ఏపీ ప్రజలకు శుభవార్త.. డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ..

Andhra Pradesh : ఏపీ ప్రజలకు శుభవార్త.. డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ..

Andhra Pradesh : రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులను ఈ నెల 18 నుంచి పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. సోమవారం సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన వైద్యారోగ్య శాఖ సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. సకాలంలో మందులు అందించడంతో పాటు, మందుల కొరత కూడా లేకుండా చూడాలని జగన్ ఆదేశించారు. మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించే విషయంలో ఎక్కడ రాజీపడొద్దని సీఎం సూచించారు.


గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి మండలంలో జనవరి 1 నుంచి ప్రతి వారం ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహిస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. 2023-24 లో నవంబర్ నెలాఖరు నాటికి 12.42 లక్షల మంది ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స తీసుకున్నారని, ఇది గత ఏడాది కంటే 24.64 శాతం అధికమని అధికారులు వెల్లడించారు. చైనాలో విస్తరిస్తున్న హెచ్9ఎన్2 వైరస్ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు.


Tags

Related News

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

Big Stories

×