BigTV English

Khammam Weather : ఖమ్మంపై మిగ్ జాం ఎఫెక్ట్.. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు

Khammam Weather : ఖమ్మంపై మిగ్ జాం ఎఫెక్ట్.. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
Khammam Weather news

Khammam Weather news(Rain news today telangana):

మిగ్ జాం తుపాన్ పై అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా.ప్రియాంక సూచించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలో మంగళవారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులను హాస్టల్ విడిచి బయటకు వెళ్లకుండా నియంత్రణ చేయాలని, అత్యవర సేవలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూము 08744 241950 నబంర్ ను సంప్రదించాలిని చెప్పారు. ప్రజలు తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని, ఇతర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని సూచించారు.


కలెక్టర్ ప్రియాంక ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా యంత్రాంగం అత్యవసర సేవలకు మండల డివిజన్, జిల్లా అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అందరికీ అన్ని రకాల సెలవులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తుపాను ప్రభావం తగ్గే వరకు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ యంత్రాంగ సలహాలు, సూచనలను పాటించాలని ప్రజలను కోరారు.


Related News

Hyderabad Rains Today: కుమ్మేస్తున్న వరుణుడు.. ఇళ్లల్లో ఉండటమే బెటర్, ఈ ఏరియాలు జలమయం

Telangana politics: కారులో భారీ కుదుపు.. కమలం గూటికి మాజీలు, బీఆర్ఎస్ తర్వాత ప్లానేంటి?

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో హైఅలర్ట్! బాంబ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు.. ఎందుకంటే..

Telangana Rains: వర్షాల ఎఫెక్ట్.. ఈ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

Telangana Government: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ ఫోకస్.. నలుగురు మంత్రులతో కమిటీ

Heavy rains: కుండపోత వర్షం.. వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Big Stories

×