Education Hub: వికారాబాద్ జిల్లా హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటినుంచి ప్రతి నెలా పనుల పురోగతిని తనిఖీ చేస్తానని చెప్పారు. ఎడ్యుకేషన్ హబ్కు సంబంధించి ఆయా విద్యా సంస్థల భవన నిర్మాణాలను, ఆ ప్రాంత అభివృద్ధి ప్రణాళికలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఎడ్యుకేషన్ హబ్లో భాగంగా నిర్మిస్తున్న ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, వెటర్నరీ కాలేజీలు, ఫిజియో థెరఫీ – పారా మెడికల్ కాలేజీలు, సంబంధిత హాస్టళ్ల నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. నిర్మాణ పనులు నెమ్మదిగా సాగడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎడ్యుకేషన్ హబ్లో ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీ పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతీ నెలా పనుల పురోగతిపై తనిఖీ చేయడమే కాకుండా ఒక రోజు సైట్లోనే బస చేస్తానని చెప్పారు.
Also Read: Chief Secretary: తెలంగాణ సచివాలయంలో సమన్వయ లోపం?.. అధికారుల సీక్రెట్ మీటింగ్స్!
పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి వారిని సస్పెండ్ చేయడానికి వెనుకాడొద్దని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారంలోగా ప్లాట్ల పట్టాలు లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
భూసేకరణను వేగవంతం చేయండి: సీఎం రేవంత్
మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భూసేకరణలో జాప్యం జరగొద్దని సీఎం అధికారులను ఆదేశించారు. అవసరమైన సర్వేయర్లతో పాటు బడ్జెట్ మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, భూసేకరణ పూర్తి… pic.twitter.com/rJO13PanN8
— BIG TV Breaking News (@bigtvtelugu) July 21, 2026
Also read: NEET Protest: ప్రధాని మోదీ ఇంటి వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!