E-Paper
Advertisement

Pawan Kalyan: పొత్తులపై కామెంట్స్.. పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ క్లాస్..

Pawan Kalyan: పొత్తులపై కామెంట్స్.. పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ క్లాస్..
Advertisement
Pawan Kalyan latest news

Pawan Kalyan On Alliances(AP breaking news today): ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఇక తేలాల్సింది సీట్ల లెక్కలే. జనసేనకు ఎన్ని టిక్కెట్లు కేటాయిస్తారనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. అటు బీజేపీ కూడా టీడీపీ-జనసేన కూటమితో కలుస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

జన హితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికే తొలి ప్రాధాన్యం ఇస్తానని జనసేనాన్ని తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని పొత్తులుంటాయన్నారు. ఆ దిశగానే ముందుకుసాగుతున్నామని చెప్పారు. ప్రస్తుతం పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇలాంటి సమయంలో జనసేన నేతలు ఎమోషనల్ గా ఎలాంటి కామెంట్స్ చేయవద్దని సూచించారు. జనసేన పాలసీలకు భిన్నమైన అభిప్రాయాలు ప్రచారం చేయవద్దని పార్టీ నాయకులకు నిర్దేశించారు. ఇలాంటి ప్రకటనలతో ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారు అవుతారని పేర్కొన్నారు.

Advertisement

Read More: AP Politics : వైసీపీ ఓటమికి త్రిశూల వ్యూహం.. సీట్ల సర్దుబాటులో చిక్కులు వీడేదెప్పుడు ?

జనసేన నేతలు తమ అభిప్రాయాలను, సందేహాలను పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ దృష్టికి తీసుకురావాలని పవన్ కల్యాణ్ కోరారు. అలా చేస్తే కార్యకర్తల మనోభావాలు పార్టీకి తెలుస్తాయని చెప్పారుట. అలాగే ఏపీ పొత్తుల విషయంలో భిన్న ప్రకటనలు చేసే వారి నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నాయకులను ఆదేశించారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×