E-Paper
Advertisement

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీటీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆఫ్‌లైన్‌, ఆన్ లైన్ టోకెన్ల జారీ విధి విధానాలు త్వరలో తెలియజేస్తామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

త్వరలోనే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు

ఒక రోజులో అందుబాటులో ఉన్న దర్శన సమయాల్లో వీఐపీలు, టికెట్ హోల్డర్ల కంటే సాధారణ భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. టోకెన్లను పారదర్శకంగా కేటాయించాలని ఆలోచిస్తున్నామన్నారు. టోకెన్ల జారీ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని అన్నారు. వికలాంగులైన భక్తులను వేచి ఉండకుండా క్యూ లైన్లలో అనుమతించాలని కాలర్స్ ఈవోను కోరినప్పుడు, వారిని ఎటువంటి అసౌకర్యం లేకుండా దర్శనానికి వెళ్లడానికి టీటీడీ ఇప్పటికే శ్రీవారి సేవా వాలంటీర్లను అందిస్తుందని తెలియజేశారు. అలాగే, భక్తులందరికీ ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తున్నామన్నారు.

ఎక్కువ దర్శనం సమయం సాధారణ భక్తులకే

తిరుపతిలో ఆన్‌లైన్ టికెట్ల ముందస్తు బుకింగ్‌ను తగ్గించడం, SSD టోకెన్ల సమయ మార్పు, శ్రీవాణి టికెట్లు మొదలైన వాటిని తగ్గించాలని కొందరు కాలర్స్ సూచించారు. దీనిపై ఈవో స్పందిస్తూ.. భక్తుల నుంచి వచ్చే అభిప్రాయాన్ని అనుసరించి టీటీడీ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. సర్వేలు, వాట్సాప్ సందేశాలు, ఈ-మెయిల్‌లు, లేఖల రూపంలో భక్తుల అభిప్రాయాలు సేకరించి వాటిని దృష్టిలో ఉంచుకుని, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని అవకాశాలను చూస్తామన్నారు. ఈ నిర్ణయాలు సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయన్నారు. ప్రస్తుతం దర్శన సమయంలో 70% కంటే ఎక్కువ సాధారణ భక్తులకు కేటాయిస్తున్నామన్నారు. వివిధ రకాల దర్శనాలలో సమస్యలను పరిష్కరించడానికి టీటీడీ ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ఈవో తెలిపారు.

Also Read: Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

శ్రీవాణి ట్రస్టుపై వివరణ

2023లో ఇంజనీరింగ్ విభాగంలో జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్‌కు సంబంధించి ఒక కాలర్ అడగా.. 15 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. దర్శన టికెట్ల కోసం దలారీలు, మధ్యవర్తులను సంప్రదించవద్దని ఈవో భక్తులకు విజ్ఞప్తి చేశారు. కొంతమంది మధ్యవర్తులు భక్తులను మోసం చేస్తున్నారని ఫిర్యాదులు క్రమం తప్పకుండా అందుతున్నాయన్నారు. శ్రీవాణి ట్రస్టును ప్రవేశపెట్టడం వెనుక ఉన్న లక్ష్యం మధ్యవర్తులను నివారించడం, ఆ నిధులను వెనుకబడిన ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఉపయోగించడమని ఈవో స్పష్టం చేశారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×