BigTV English
Advertisement

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీటీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆఫ్‌లైన్‌, ఆన్ లైన్ టోకెన్ల జారీ విధి విధానాలు త్వరలో తెలియజేస్తామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.


త్వరలోనే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు

ఒక రోజులో అందుబాటులో ఉన్న దర్శన సమయాల్లో వీఐపీలు, టికెట్ హోల్డర్ల కంటే సాధారణ భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. టోకెన్లను పారదర్శకంగా కేటాయించాలని ఆలోచిస్తున్నామన్నారు. టోకెన్ల జారీ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని అన్నారు. వికలాంగులైన భక్తులను వేచి ఉండకుండా క్యూ లైన్లలో అనుమతించాలని కాలర్స్ ఈవోను కోరినప్పుడు, వారిని ఎటువంటి అసౌకర్యం లేకుండా దర్శనానికి వెళ్లడానికి టీటీడీ ఇప్పటికే శ్రీవారి సేవా వాలంటీర్లను అందిస్తుందని తెలియజేశారు. అలాగే, భక్తులందరికీ ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తున్నామన్నారు.

ఎక్కువ దర్శనం సమయం సాధారణ భక్తులకే

తిరుపతిలో ఆన్‌లైన్ టికెట్ల ముందస్తు బుకింగ్‌ను తగ్గించడం, SSD టోకెన్ల సమయ మార్పు, శ్రీవాణి టికెట్లు మొదలైన వాటిని తగ్గించాలని కొందరు కాలర్స్ సూచించారు. దీనిపై ఈవో స్పందిస్తూ.. భక్తుల నుంచి వచ్చే అభిప్రాయాన్ని అనుసరించి టీటీడీ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. సర్వేలు, వాట్సాప్ సందేశాలు, ఈ-మెయిల్‌లు, లేఖల రూపంలో భక్తుల అభిప్రాయాలు సేకరించి వాటిని దృష్టిలో ఉంచుకుని, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని అవకాశాలను చూస్తామన్నారు. ఈ నిర్ణయాలు సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయన్నారు. ప్రస్తుతం దర్శన సమయంలో 70% కంటే ఎక్కువ సాధారణ భక్తులకు కేటాయిస్తున్నామన్నారు. వివిధ రకాల దర్శనాలలో సమస్యలను పరిష్కరించడానికి టీటీడీ ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ఈవో తెలిపారు.


Also Read: Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

శ్రీవాణి ట్రస్టుపై వివరణ

2023లో ఇంజనీరింగ్ విభాగంలో జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్‌కు సంబంధించి ఒక కాలర్ అడగా.. 15 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. దర్శన టికెట్ల కోసం దలారీలు, మధ్యవర్తులను సంప్రదించవద్దని ఈవో భక్తులకు విజ్ఞప్తి చేశారు. కొంతమంది మధ్యవర్తులు భక్తులను మోసం చేస్తున్నారని ఫిర్యాదులు క్రమం తప్పకుండా అందుతున్నాయన్నారు. శ్రీవాణి ట్రస్టును ప్రవేశపెట్టడం వెనుక ఉన్న లక్ష్యం మధ్యవర్తులను నివారించడం, ఆ నిధులను వెనుకబడిన ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఉపయోగించడమని ఈవో స్పష్టం చేశారు.

Related News

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

Big Stories

×