E-Paper
Advertisement

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ
Advertisement

APSRTC Google Maps: ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణం ఇక మరింత సులభతరంగా మారనుంది. ఏపీఎస్ఆర్టీసీ గూగుల్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు ప్రయాణికులు గూగుల్ మ్యాప్స్ ద్వారా నేరుగా ఆర్టీసీ బస్సు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇప్పటి వరకూ రూట్, దూరం, ప్రయాణ సమయం చెక్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పటి నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సు రూట్ లను వీక్షించడంతో పాటు ఆన్‌లైన్‌లో రిజర్వ్ చేసుకోవచ్చు.

టికెట్ బుకింగ్ ఎలా అంటే?

ఉదాహరణకు విజయవాడ నుంచి విశాఖ రూట్ మ్యాప్ కోసం గూగుల్ మ్యాప్స్‌లో చెక్ చేయండి. అందులో నకడ, బైక్‌లు, కార్లు, బస్సు, రైళ్ల ప్రయాణ సమయం, దూరం, రూట్ వివరాలు చూపిస్తాయి. ఏపీఎస్ఆర్టీసీ బస్సు షెడ్యూల్ ను కూడా చూపిస్తాయి. ఆ మార్గంలో నడుస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల జాబితా, బయలుదేరే సమయాలు, ప్రయాణ సమయం, చేరుకునే వ్యవధి బస్సు సింబల్ పై క్లిక్ చేస్తే కనిపిస్తాయి. బస్సు ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా నేరుగా ఏపీఎస్అర్టీసీ వెబ్‌సైట్‌కు డైవర్ట్ అవుతారు. అక్కడ మీరు బస్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పేమెంట్ చేయవచ్చు. దీంతో మీరు బస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.

Advertisement

ఏపీఎస్ఆర్టీసీ, గూగుల్ మ్యాప్స్ ఫీచర్‌ను ముందుగా విజయవాడ-హైదరాబాద్ మార్గంలో పరీక్షించారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో ఏపీలో ప్రారంభించనున్నారు. ఈ సేవల కోసం ఏపీఎస్ఆర్టీసీ గూగుల్‌కు వివరణాత్మక డేటాను అందించింది. ఆర్టీసీ ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు ఏయే రూట్ల వివరాలు గూగుల్ కు అందించింది. దీంతో గూగుల్ బస్ స్టాపుల వివరాలను మ్యాప్స్ లో నమోదు చేసింది.

త్వరలో అన్ని మార్గాలకు

త్వరలో గూగుల్ మ్యాప్స్ ద్వారా నేరుగా ఏపీఎస్ఆర్టీసీ మార్గాల్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే ప్రయాణ వివరాలను, రూట్లను సులభంగా తెలుసుకోవచ్చు.

Advertisement

Also Read: AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×