BigTV English
Advertisement

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ పెట్టుబడులతో ముందుకు దూసుకెళ్తోందని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు మంత్రి నారా లోకేష్‌తో సహా తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. టీడీపీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూస్తోందని.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం శుభపరిణామమని తెలిపారు


ముఖ్యంగా.. క్వాంటమ్‌ కంప్యూటర్‌ను అనుకున్న సమయానికి అమరావతికి తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర సాంకేతిక ప్రగతికి ఒక మైలురాయిగా నిలవనుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల సాధనలో రాష్ట్ర ఐటీ, పర్యాటక శాఖల మంత్రి నారా లోకేష్‌ ఎంతో క్రియాశీలకంగా.. తీవ్ర కృషితో వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. ఆయన ప్రయత్నాల ఫలితంగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయని అన్నారు. ఇటీవల నాయుడుపేటలో తెలంగాణకు చెందిన ప్రీమియర్‌ ఎనర్జీస్‌ భారీ పెట్టుబడులు పెట్టడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ప్రపంచ దేశాల దృష్టి విశాఖపట్నంపై పడిందని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో ఇటీవల జరిగిన సీసీఎస్ (క్యాపిటల్ ఆఫ్ కోస్టల్ సర్వీసెస్) సమ్మిట్ గొప్ప వరమని ఆయన అభివర్ణించారు. ఇలాంటి అంతర్జాతీయ స్థాయి సమావేశాలు రాష్ట్ర ప్రతిష్టను పెంచుతాయని, భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. రాజధాని నగరం అమరావతి బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. దీనిలో భాగంగా, ఇటీవల జరిగిన తమన్, ఇళయరాజా మ్యూజికల్ నైట్ వంటి భారీ ఈవెంట్లు అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తున్నాయని, రాష్ట్ర రాజధాని ప్రాముఖ్యతను ఇవి చాటుతున్నాయని సీఎం స్పష్టం చేశారు.


పరిపాలనలో పారదర్శకత, ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఇందులో భాగంగా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామని, ముఖ్యంగా వివాదాస్పదంగా ఉన్న 22ఏ నిషేధిత జాబితా భూములపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు, వాటికి వేగవంతమైన పరిష్కారం అందించేందుకు ఎమ్మెల్యేలు విధిగా ప్రజాదర్బార్‌ నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ చర్యలు ప్రజా కేంద్రీకృత పాలనకు నిదర్శనమని ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక, పాలనా సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలోనే దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ: Actor Ajay: చిరంజీవి కంటే బాలయ్య అంటేనే ఇష్టం… రెమ్యునరేషన్ పై అజయ్ షాకింగ్ కామెంట్స్!

 

Related News

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

Big Stories

×