BigTV English

Pawan Kalyan: తెలంగాణను దోచేశారు.. తన్నితరిమేస్తే ఉత్తరాంధ్రపై పడ్డారు.. పవన్ రుషికొండ విజిట్..

Pawan Kalyan: తెలంగాణను దోచేశారు.. తన్నితరిమేస్తే ఉత్తరాంధ్రపై పడ్డారు.. పవన్ రుషికొండ విజిట్..
pawan rishikonda

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కదంతొక్కారు. ఎవర్రా మనల్ని ఆపేదంటూ రుషికొండ బాట పట్టారు. పోలీసులు అనేక ఆంక్షలు పెట్టారు. రోడ్డు మీద నుంచే చూడాలంటూ.. కొన్ని వాహనాలకే అనుమతి అంటూ.. ఖాకీలు నానాకొర్రీలు పెట్టారు. జనసేనాని అలానే చేశారు. పోలీస్ చెక్ పోస్ట్ దగ్గరే కారు ఆపేసి.. నడుచుకుంటూ రుషికొండ దగ్గరకు వెళ్లారు. రుషికొండ తవ్వకాలను పరిశీలించారు.


చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే.. ఇలా చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా? అంటూ నిలదీశారు. మిగతా వాళ్లు శాంతియుతంగా నిరసన తెలిపినా.. కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారే.. మీరు మాత్రం ఇలా చట్టవ్యతిరేకంగా కొండను తవ్వేస్తారా? అని పశ్నించారు పవన్ కల్యాణ్. తుఫాను వచ్చినా కొట్టుకుపోకుండా రుషికొండ గ్రామాన్ని కాపాడుతున్న ఈ శతాబ్దాల నాటి కొండను తవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణను కూడా ఇలానే దోపిడీ చేశారని.. అందుకే అక్కడి నుంచి తన్నితరిమేశారని అన్నారు పవన్. తెలంగాణను దోచింది చాలక.. ఉత్తరాంధ్ర మీద పడ్డారని.. ఇక్కడికి వచ్చి దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులనే అడ్డగోలుగా దోచేస్తుంటే.. ఇక ప్రైవేట్ ఆస్తులను వదులుతారా? అని అన్నారు.


ఒక్క రాజధానికే దిక్కులేదు కానీ మూడు రాజధానులు అంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి అధికారిక భవనం కావాలంటే.. సర్క్యూట్ హౌజ్ ఉంది కదా.. రుషికొండ మీద ఎందుకు పడ్డారని.. ప్రకృతి దృశ్యాలు కావాలా ముఖ్యమంత్రికి? జగన్‌కు ఇంకా ఎన్ని ఇళ్లు కావాలంటూ ఫైర్ అయ్యారు పవన్ కల్యాణ్.

Related News

AP GST Collections: ప‌న్నుల రాబ‌డిలో ప‌రుగులు తీస్తున్న ఏపీ.. సెప్టెంబ‌ర్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వ‌సూళ్లు

AP Heavy Rains: తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ప్రజలు బయటకు రావొద్దు

Visakha Heavy Rains: వాయుగుండం ఎఫెక్ట్.. విశాఖలో భారీ వర్షాలు, గాలుల బీభత్సం

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Big Stories

×