E-Paper
Advertisement

TDP : పోలవరం పాలిటిక్స్.. టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు..

TDP : పోలవరం పాలిటిక్స్.. టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు..

Polavaram latest news telugu(AP politics) : టీడీపీ నేతలు చేపట్టిన పోలవరం యాత్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రాజెక్టు వద్దకు వెళుతుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. కొందరు టీడీపీ నేతలు ఏలూరు నుంచి గోపాలపురం మీదుగా పోలవరం బయలుదేరారు. అయితే వారిని కొవ్వూరుపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, గన్ని వీరాంజనేయులు, బడేటి రాధాకృష్ణతోపాటు మరికొందరు పార్టీ నేతలను పోలీసులు ఆపేశారు. దీంతో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా టీడీపీ నేతలు ప్రతిఘటించారు. దీంతో టీడీపీ నేతలను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు.

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలీసుల కళ్లుగప్పి బైక్ పై పోలవరం వైపు బయలేదారు. అయితే ఆయను పోలీసులు అదుపులోకి తీసుకుని కొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మిగిలిన టీడీపీ నేతలను గోపాలపురం పీఎస్ కు తరలించారు. మరోవైపు పోలవరం వద్ద పోలీసులు భారీగా సిబ్బందిని మోహరించారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×