BigTV English

AP Fake Votes: ఏపీలో దొంగ ఓట్లు.. పోటాపోటీగా ఈసీకి కంప్లైంట్ చేసిన పార్టీలు

AP Fake Votes: ఏపీలో దొంగ ఓట్లు.. పోటాపోటీగా ఈసీకి కంప్లైంట్ చేసిన పార్టీలు

AP Fake Votes(Latest news in Andhra Pradesh):

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. మాల్‌ ప్రాక్టీస్‌పై వైసీపీ, దొంగ ఓట్లపై విపక్ష పార్టీలు బీజేపీ, టీడీపీలు పోటాపోటీగా గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. తొలుత వైసీపీ ఎంపీలు ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారు. పీపుల్స్‌‌‌‌ రిప్రెజెంటేషన్‌‌‌‌ యాక్ట్‌ను ఉల్లంఘిస్తూ ఎన్నికల సంఘం డేటాను దుర్వినియోగం చేస్తూ టీడీపీ మాల్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌కు పాల్పడుతున్నదని కంప్లైట్ చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన దొంగ ఓట్ల మాల్‌‌‌‌ప్రాక్టీస్‌‌‌‌పై అనేక అంశాల్ని కమిషన్‌‌‌‌తో సుదీర్ఘంగా చర్చించినట్లు.. విజయసాయిరెడ్డి తెలిపారు.


ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఎంపీలే ఈసీఐకి కంప్లైట్ చేయడం దురదృష్టకరమని టీడీపీ ఎంపీ కనకమేడల విమర్శించారు. 10 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని తామిచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి స్పందన లేదన్నారు. అందుకే ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ నెల 22న రాష్ట్రానికి వస్తామని ఈసీఐ ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలిపారు.

ఏపీలో దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించినట్లు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. ఆమె నేతృత్వంలో ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి, ముఖ్య నేతలు సత్యకుమార్, భానుప్రకాష్ రెడ్డి ఈసీఐ అధికారులతో భేటీ అయ్యారు.


.

.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×