E-Paper
Advertisement

Purandeswari : సెంటిమెంట్.. తండ్రి ఎన్టీఆర్ బాటలో పురందేశ్వరి..

Purandeswari : సెంటిమెంట్.. తండ్రి ఎన్టీఆర్ బాటలో పురందేశ్వరి..
Advertisement

Purandeswari : ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్రంలో పర్యటనలకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ బాటనే ఎంచుకున్నారు. ఆయన టీడీపీని స్థాపించిన తర్వాత రాయలసీమలో తొలిసారి పర్యటించారు. ఇప్పుడు పురందేశ్వరి కూడా ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టాక రాయలసీమ నుంచి తన పర్యటనలకు శ్రీకారం చుట్టారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరుకు పురందేశ్వరి వెళ్లారు. అక్కడ నిర్వహించిన బీజేపీ రాయలసీమ జోనల్ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలకు పురందేశ్వరి దిశా నిర్దేశం చేశారు. రాయల్ కౌంటీలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Advertisement

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే వైసీపీ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు గుప్పించారు పురందేశ్వరి. తాజా సమావేశంలో అదే ధోరణిలో అనుసరించారు. రాష్ట్రానికి కేంద్రం సహకారం అందిస్తోందని తెలిపారు. అయితే అభివృద్ధి పనులు చేయడంలో రాష్ట్ర పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్నా.. సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైందని ఆరోపించారు. తన తండ్రి ఎన్టీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని రాయలసీమ నుంచే ప్రారంభించిన విషయాన్ని పురందేశ్వరి గుర్తు చేసుకున్నారు. తాను రాష్ట్ర పర్యటనను రాయలసీమ నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వం విధానాలపైనే పురందేశ్వరి ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలను వివరిస్తున్నారు. టీడీపీతో పొత్తు అంశంపై ఆమె ఆచితూచి స్పందిస్తున్నారు. పొత్తులను బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మాత్రం త్వరలోనే భేటీ అవుతానని ఇప్పటికే పురందేశ్వరి చెప్పారు.

Tags

Related News

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్.. రైతులకు అదిరిపోయే తీపి కబురు!

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Big Stories

Advertisement
×