E-Paper
Advertisement

Tirupati Ragging: తిరుపతి ర్యాగింగ్ ఘటనపై మంత్రి లోకేశ్ సీరియస్.. దర్యాప్తునకు ఆదేశం

Tirupati Ragging: తిరుపతి ర్యాగింగ్ ఘటనపై మంత్రి లోకేశ్ సీరియస్.. దర్యాప్తునకు ఆదేశం

Tirupati Ragging: తిరుపతి జిల్లా నారాయణవనంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ లో చోటుచేసుకున్న ర్యాగింగ్ ఘటన ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి లోకేశ్ తెలిపారు. జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థుల అమానుష దాడి కలచివేసిందన్నారు. ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులపై యాజమాన్యం ఇప్పటికే చర్యలు తీసుకుందని చెప్పారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్ పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. విద్యార్థులు ర్యాగింగ్ ను వీడి స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అసలేం జరిగిందంటే?

తిరుపతి జిల్లా నారాయణవనం సిద్ధార్థ కాలేజీ హాస్టల్‌‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జూనియర్ విద్యార్థిపై సీనియర్లు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. జూనియర్ విద్యార్థిని కాళ్లతో తన్నుతూ అమానుషంగా దాడి చేశారు. సిద్ధార్థ కాలేజీలో ఫస్టియర్ పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ పేరుతో దాడికి దిగారు. జూనియర్ పై దాడి దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.

జూనియర్ పై ఆరుగురి దాడి

జూనియర్ పై మొత్తం ఆరుగురు సీనియర్లు దాడి చేశారు. దాడి విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. ర్యాగింగ్ వీడియోలు బయటకు రావడంతో పోలీసులు కాలేజీ హాస్టల్ కు చేరుకుని విచారించారు. అయితే ఓ యువతితో ప్రేమ వ్యవహారంలో ఈ దాడి జరిగిందని పోలీసులు నిర్థారించారు. బాధితుడి తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వారు హాస్టల్ కు చేరుకుని తమ కుమారుడ్ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు.

పోలీస్ కేసు నమోదు

మంచి భవిష్యత్‌ కోసం హాస్టల్‌లో వేసి చదివిస్తుంటే ఇంత దారుణంగా దాడికి పాల్పడ్డారని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాగింగ్ ఘటనపై బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాడి చేసిన ఆరుగురు సీనియర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీనియర్ల దాడిలో గాయపడిన జూనియర్ విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు.

Also Read: Uppada Fishermen Issue: ఉప్పాడ మత్స్యకారుల సమస్యపై డిప్యూటీ సీఎం రంగంలోకి.. ఏం చేశారంటే?

దాడికి చేసిన వారిపై చర్యలు

ర్యాగింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ర్యాగింగ్ ఘటనపై సిద్ధార్థ కాలేజీ యాజమాన్యం స్పందించింది. ఇప్పటికే సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకున్నామని ప్రకటించింది. దాడి చేసిన వారిని కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపింది.

 

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×