Anatapuram Software engineer detained by NIA: ఏపీలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. అనంతపురం జిల్లా రాయదుర్గం తహసీల్దార్ రోడ్డులోని ఓ వీధిలో రిటైర్డ్ హెడ్ మాష్టార్ అబ్దుల్ ఇంట్లో మంగళవారం ఉదయం సోదాలు చేశారు.
ఆయన చిన్న కుమారుడు సోహెల్ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు బెంగుళూరులోని సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొద్దిరోజులుగా వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ పేరుతో ఇంట్లో నుంచి విధులు నిర్వహిస్తున్నాడు.
కొద్దిరోజుల కిందట సోహెల్ బ్యాంకు అకౌంట్కు భారీ నిధులు రావడంతో అతడి ఫ్యామిలీ సభ్యులను విచారణ చేస్తున్నారు అధికారులు. టెక్కీని రాయదుర్గం పోలీసుస్టేషన్కు తరలించారు. సోహెల్కు ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు.
రిటైర్డ్ హెడ్ మాస్టర్ కొడుకులకు ఉగ్రవాదులతో లింకులు?
అనంతపురం జిల్లా రాయదుర్గం నాగుబావిలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ ముమ్మర తనిఖీలు. బెంగళూరులో నివాసం ఉంటూ కొంతకాలంగా కనిపించని అబ్దుల్ కుమారులు. ఉగ్రవాదులతో లింకులపై ఎన్ఐఏ అధికారుల ఆరా.#AndhraPradesh #Anantapur… pic.twitter.com/qcJ8Sk2Zu1
— BIG TV Breaking News (@bigtvtelugu) May 21, 2024