E-Paper
Advertisement

Somireddy Deeksha: అక్రమ మైనింగ్ పై సోమిరెడ్డి దీక్ష.. పోలీసుల లాఠీచార్జ్

Somireddy Deeksha: అక్రమ మైనింగ్ పై సోమిరెడ్డి దీక్ష.. పోలీసుల లాఠీచార్జ్
latest news in andhra pradesh

Somireddy Deeksha(Latest news in Andhra Pradesh):

అవీనీతి అక్రమాలపై మాజీ మంత్రి సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం గ్రామ సమీపంలోని రుస్తుం, భారత్ మైన్ లో జరుగుతున్న అవీనీతి అక్రమాలపై మాజీ మంత్రి సత్యాగ్రహ దీక్ష చేశారు. పోలీసులు‌ సోమిరెడ్డి దీక్షను భగ్నం చేశారు .

అడ్డుకున్న టిడిపి నాయకులు, కార్యకర్తలపైకి పోలీస్ వాహనం దూసుకెళ్లింది. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో పోలీసులు టిడిపి నాయకులు , కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. అక్రమ మైనింగ్ కు సోమిరెడ్డి వ్యతిరేకంగా 4 రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. డిసెంబర్ 18న భారీ సంఖ్యలో హిజ్రాలు సోమిరెడ్డి దీక్ష శిబిరం వద్దకు వచ్చి దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నించారు.

లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు దీక్షను విరమించాలని సోమిరెడ్డిని కోరారు. అక్రమ మైనింగ్ పై కోర్టు ఆదేశాలు ఇంప్లిమెంట్ చేస్తేనే దీక్షను విరమిస్తానని సోమి రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో శిబిరం వద్ద ఉండేందుకు నలుగురికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు.

అనుమతి ఇచ్చినప్పటికీ డిసెంబర్ 19 తెల్లవారుజామున 2.30 గంటలకు భారీ సంఖ్యలో పోలీసులు దీక్ష శిబిరం వద్దకు చేరుకున్నారు. సోమిరెడ్డిని బలవంతంగా జీప్ లోకి ఎక్కించారు. పోలీసుల చర్యకు వ్యతిరేకంగా టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×