E-Paper
Advertisement

Varahi yatra schedule Vizag : వారాహికి స్పీడ్ బ్రేకర్లు.. విశాఖ యాత్రకు 22 షరతులు.. జనసేనాని గ్రాండ్ ఎంట్రీ

Varahi yatra schedule Vizag : వారాహికి స్పీడ్ బ్రేకర్లు.. విశాఖ యాత్రకు 22 షరతులు.. జనసేనాని గ్రాండ్ ఎంట్రీ
Advertisement
Pawan kalyan varahi yatra Visakhapatnam

Pawan kalyan varahi yatra Visakhapatnam(AP politics):

జనసేనాని మూడో విడత వారాహి యాత్రకు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదంటూ గట్టిగానే ఆంక్షలు విధించారు. మొత్తం 22 షరతులతో యాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు.

యాత్ర తొలిరోజు సభను జగదాంబ నుంచి ప్రారంభించాలని ముందుగా ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. జనసేన నేతలతో కలిసి పోలీసులు సభాప్రాంగణాన్ని పరిశీలించి అనుమతులిచ్చారు. తీరా బుధవారం రాత్రి సభా స్థలిని మరోచోటకు మార్చాలని సూచించారు. బీచ్‌ రోడ్డు లేదా జైలు రోడ్డులో నిర్వహించుకోవాలని సీపీ త్రివిక్రమవర్మ తెలిపినట్లు జనసేన నాయకులు చెప్పారు. మొదట సరే అని సడన్‌గా మరోచోటకు మార్చుకోమంటే కష్టమని నాయకులు తేల్చి చెప్పారు. బుధవారం రాత్రి సభ విషయంపై పోలీస్‌ కమిషనర్‌ డీసీపీలు, ఏసీపీలు, ట్రాఫిక్‌ అధికారులతో చర్చించి ఎట్టకేలకు షరతులతో జగదాంబ వద్ద సభకు అనుమతిచ్చారు.

Advertisement

సభకు 22 షరతులతో కూడిన అనుమతిని ఇచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి ఓపెన్‌ టాప్‌లో రాకూడదని మౌఖికంగా ఆదేశాలిచ్చారు. హైవేపై వారాహి యాత్ర చేయకూడదని షరతు విధించారు. రోడ్లపై ఎక్కడైనా ప్రజలు ఎక్కువమంది ఉంటే అక్కడ వాహనం నుంచి దిగకూడదని, నిలబడకూడదని షరతు పెట్టారు. సెక్షన్‌ 30 అమల్లో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని, ఇతర పార్టీలపై నిరాధార ఆరోపణలు, విమర్శలు చేయకూడదని.. ప్రజలకు భయాందోళనలు కలిగించేలా ప్రకటనలు ఉండకూడదని సూచించారు. గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ కాకూడదని, విగ్రహాలు, ఆస్తులను ధ్వంసం చేయకూడదని పేర్కొన్నారు. తొక్కిసలాట దృష్ట్యా తక్కువమందినే అనుమతిస్తామన్నారు. షరతుల్లో ఏదైనా ఉల్లంఘిస్తే ముందస్తు నోటీసు లేకుండా అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

అయితే, ఈ ఆంక్షలేవీ లెక్క చేయకుండా.. గురువారం ఉదయం విశాఖకు వచ్చిన పవన్ కల్యాణ్‌కు జనసైనికులు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్ వరకు.. భారీ కాన్వాయ్‌తో జనసేన సత్తా చాటారు. పవన్ ప్రభంజనాన్ని పోలీస్ రూల్స్ అడ్డుకోలేవని చాటిచెప్పారు.

Advertisement

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మూడో విడత వారాహి యాత్రకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు విడతల్లో వారాహి యాత్రను పూర్తిచేసిన ఆయన గురువారం నుంచి ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించేందుకు రెడీ అయ్యారు.

విశాఖలోని జగదాంబ సెంటర్‌ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఈనెల 14 వరకూ పవన్‌ విశాఖలోనే ఉంటారు. అదేరోజు రాత్రికి విజయవాడకు చేరుకుని, 15న స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొంటారు. 16న మంగళగిరి పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. తిరిగి 17 నుంచి యాత్ర కొనసాగిస్తారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×