BigTV English
Advertisement

AP : అగ్నిగుండంగా మారిన ఏపీ.. మరో రెండు రోజులు తీవ్ర వడగాల్పులు..

AP : అగ్నిగుండంగా మారిన ఏపీ.. మరో రెండు రోజులు తీవ్ర వడగాల్పులు..


Weather news andhra pradesh(AP updates): ఏపీ అగ్నిగుండంగా మారింది. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఎండలు మండుతున్నాయి. గురువారం ఉష్టోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. 210 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలోని 31 శాతం మండలాలు నిప్పుల గుండంగా మారాయి. మరో 220 మండలాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగానే ఉంది. మొత్తంగా 64 శాతంపైగా మండలాల్లోని ప్రజలు ఉష్ణతాపానికి అల్లాడారు. నర్సాపురంలో సాధారణం కంటే అధికంగా 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.

శుక్ర, శనివారాల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 268 మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీస్తాయని ప్రకటించింది. మరో 235 మండలాల్లో వడగాల్పుల ప్రభావంగా ఉంటుందని తెలిపింది.


గురువారం అనకాపల్లి జిల్లాలోని 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. విశాఖపట్నం జిల్లాలోని 8 మండలాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.5 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా కురిచేడులో 44.2 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో 44.1 డిగ్రీలు, తిరుపతి జిల్లా సత్యవేడులో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే విశాఖపట్నం, బాపట్లలో 7.1 డిగ్రీలు, మచిలీపట్నంలో 6.9 డిగ్రీలు, జంగమహేశ్వరపురంలో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా రికార్డయ్యాయి.

Related News

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Big Stories

×